ప్రస్తుత క్యాలెండర్ ఏడాది (2022)లో భారత ఉద్యోగుల సగటు వేతనం 9 శాతంగా ఉండవచ్చునని మెర్సర్ స్టడీ సర్వే వెల్లడించింది. కరోనా సంక్షోభం కారణంగా 2020లో ప్రోత్సాహకాలు, వేతనాలు భారీగా తగ్గిన విషయం తెలిసిందే. ఇప్పుడు క్రమంగా మళ్లీ కరోనా పూర్వస్థితికి చేరుకున్నట్లుగా నివేదిక తెలిపింది. ఈ సర్వేలో 5700 జాబ్ ఫంక్షన్స్, 14 లక్షలకు పైగా క్యుమ్యులేటివ్ ఎంప్లాయీస్ కలిగిన 988 కంపెనీలు పాల్గొన్నాయి. ఈ సర్వేలో పాల్గొన్న కంపెనీల్లో టెక్నాలజీ, సర్వీసెస్, లైఫ్ సైన్సెస్, ఆటోమోటివ్, మ్యానుఫ్యాక్చరింగ్, లాజిస్టిక్స్, ఎనర్జీ, కన్స్యూమర్ తదితరాలు ఉన్నాయి. మెర్సెర్ టోటల్ రెమ్యునరేషన్ పేరుతో ఈ సర్వేను నిర్వహించింది.

ఈ రంగాల్లో అధిక పెంపు
వినియోగదారు ఆధారిత, లైఫ్ సైన్సెస్, టెక్నాలజీ తదితర రంగాల్లో పరిశ్రమ సగటు కంటే వేతన పెంపు అధికంగా ఉండవచ్చునని ఈ సర్వే అభిప్రాయపడింది. సానుకూల ఆర్థిక, వ్యాపార సెంటిమెంటుతో 2022లో వేతన పెంపు 9 శాతంగా ఉండవచ్చునని, 2020లో ఇది 7.7 శాతంగా ఉండే అవకాశముందని పేర్కొంది. టెక్ రంగంలో అన్ని విభాగాల ఉద్యోగుల వేతన ఇంక్రిమెంట్లు 2019 స్థాయికి చేరినట్లు తెలిపింది. 2021లో పరిశ్రమ సగటు వేతన పెంపు 8 శాతంగా ఉన్నట్లు తెలిపింది.

భవిష్యత్తు భేష్
టెక్నాలజీ సంబంధిత నైపుణ్యాలు కలిగిన ఉద్యోగులకు ప్రస్తుతం, భవిష్యత్తులో వేతన పెంపు అధికంగా ఉంటుందని తెలిపింది. 2018-21 మధ్య గత నాలుగేళ్ల కాలంలో టెక్ శాలరీ పెంపు 17 శాతంగా ఉండగా, సాఫ్టువేర్ డెవలప్మెంట్, ఆర్ అండ్ డీ, ప్రీ-సేల్స్, ప్రోడక్ట్ కన్సల్టింగ్, డేటా సైన్సెస్లో 12 శాతం వరకు ఉందని తెలిపింది.

మరో సర్వే కూడా
భారత్లో వేతన పెంపు ఈ ఏడాది అయిదేళ్ల గరిష్టం 9.9 శాతానికి చేరుకోవచ్చునని మరో నివేదిక ఆయాన్ సర్వే వెల్లడించింది. ఆర్థిక రికవరీ పుంజుకోవడం, సానుకూల వ్యాపార సెంటిమెంట్తో కంపెనీలు కొత్త తరం సామర్థ్యాలను నిర్మించేందుకు సిద్ధంగా ఉండటం, అధిక పెట్టుబడుల ప్రణాళికలతో ముందుకు వస్తుండటం వేతన పెంపుకు అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ఈ-కామర్స్, వెంచర్ క్యాపిటల్, ఐటీ, ఐటీఈఎస్, లైఫ్ సైన్సెస్ రంగాల్లో అధిక వేతన పెంపు ఉండవచ్చునని తెలిపింది.
More From GoodReturns

నేస్తం నేనున్నా.. భారత్కు అండగా నిలిచిన రష్యా.. చమురు సంక్షోభంపై కీలక ప్రకటన..

ఎర్ర సముద్రంలో కల్లోలం..భారత ఎగుమతులపై భారీ ఎఫెక్ట్..తడిసిమోపెడవుతున్న ఛార్జీలు..

యురేనియం నుంచి వాణిజ్యం వరకు.. మోదీ–కార్నీ భేటీలో జరిగిన ఒప్పందాలు ఇవే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?



Click it and Unblock the Notifications