కాగ్నిజెంట్ రాన్సమ్వేర్ ఖరీదు 70 మిలియన్ డాలర్లు, 20,000 కొత్త ఉద్యోగాలు
సాఫ్టువేర్ దిగ్గజం కాగ్నిజెంట్ జనవరి - మార్చి క్వార్టర్ ఫలితాలను ప్రకటించింది. మార్చి క్వార్టర్లో నికర ఆదాయంలో 16.7% క్షీణత నమోదై 367 మిలియన్ డాలర్లుగా ఉంది. కాగ్నిజెంట్ సంస్థ క్యాలెండర్ ఇయర్ జనవరి నుండి డిసెంబర్ ఆర్థిక సంవత్సరాన్ని అనుసరిస్తుంది. 2019లో ఇదే క్వార్టర్లో నికర లాభం రూ.441 కోట్లుగా ఉంది. కాగ్నిజెంట్ హెడ్ క్వార్టర్ న్యూజెర్సీలో ఉంటుంది. ఈ కంపెనీకి ఇండియాలో 2 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు.
2 నెలలు అనుకుంటే..: కొటక్ మహీంద్రా కీలక నిర్ణయం, ఆ ఉద్యోగుల వేతనాల్లో 10% కోత
రాన్సమ్ వేర్ అటాక్ ఖరీదు 70 మిలియన్ డాలర్లు
క్వార్టర్ రెవెన్యూ 2.8 శాతం పెరిగి 4.2 బిలియన్ డాలర్లుగా ఉంది. అంతకుముందు ఏడాది ఇది 4.11 బిలియన్ డాలర్లుగా ఉంది. రాన్సామ్ అటాక్ కారణంగా ఈ క్వార్టర్లో 50 మిలియన్ డాలర్ల నుండి 70 మిలియన్ డాలర్ల మేర ప్రభావం పడిందని అంచనా వేస్తోంది. 2020లో మార్జిన్స్ 16 శాతం నుండి 17 శాతానికి ఉంటాయని అంచనా వేస్తోంది.
ఆపరేషన్స్ ఖర్చు
కాగ్నిజెంట్ ఆఫరేషన్స్ ఖర్చు మార్చి క్వార్టర్లో 15.1 శాతంగా ఉంది. అంతకుముందు డిసెంబర్ క్వార్టర్లో 17 శాతంగా ఉంది. కంపెనీ డిజిటల్ రెవెన్యూ 41 శాతంగా ఉంది. అంతకుముందు ఏడాది ఇదే సమయంలో 19 శాతంగా ఉంది. ఎంప్లాయీస్ రిటెన్షన్ కాస్ట్ 10 మిలియన్ డాలర్లుగా ఉంది. ఉద్యోగుల వేతనాల కోసం 26 మిలియన్లు ఖర్చు చేసింది. ఏప్రిల్ నెల వరకు ఇది 1.74 బిలియన్ డాలర్లు రుణాన్ని తగ్గించుకుంది.
20,000 నియామకాలు
కంపెనీ డిజిటల్ స్కిల్స్ డెవలప్మెంట్లో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తిగా ఉంది. ఇందుకోసం 20,000 కొత్త నియామకాలను చేపట్టనుంది. 41 శాతం ఆదాయం డిజిటల్ సర్వీసెస్ ద్వారా వచ్చింది.