కార్వీ జీఎస్టీ సర్వీసెస్ను కొనుగోలు చేసిన క్లియర్ ట్యాక్స్
కార్వీ గ్రూప్కు చెందిన కార్వీ డేటా మేనేజ్మెంట్ సర్వీసెస్ (KDML) జీఎస్టీ సాఫ్టువేర్ సర్వీసెస్ వ్యాపారాన్ని కొనుగోలు చేసినట్లు క్లియర్ ట్యాక్స్ వెల్లడించింది. ఫిన్టెక్ సంస్థ అయిన క్లియర్ ట్యాక్స్ జీఎస్టీ, ఇతర పన్నులు, పెట్టుబడి సేవల విభాగాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది.
ఈ కొనుగోలు వల్ల కార్వీ నుండి దాదాపు 200 సంస్థలు క్లియర్ ట్యాక్స్ కిందకు వస్తాయి. తద్వారా తన జీఎస్టీ కస్టమర్ల సంఖ్య పెరుగుతుందని, అలాగే వ్యాపార పరిమాణం పెంచుకోవచ్చునని క్లియర్ ట్యాక్స్ తెలిపింది. దేశంలోని జీఎస్టీ కాంప్లియెన్స్ సాఫ్టువేర్ కంపెనీల్లో అతిపెద్దదిగా తమ సంస్థ ఆవిర్భవిస్తుందన్నారు.
అయితే కార్వీ నుండి దీనిని ఎంత మొత్తానికి కొనుగోలు చేసిందో తెలియరాలేదు. కార్వీ జీఎస్టీ వ్యాపారాన్ని కొనుగోలు చేసినట్లు సోమవారం వెల్లడించిన క్లియర్ ట్యాక్స్ కొనుగోలు వ్యాల్యూ వివరాలు తెలియజేయలేదు. క్లియర్ ట్యాక్స్కు దాదాపు 400 మంది కస్టమర్లు ఉన్నారు.
క్రూడాయిల్ దెబ్బ: రోజులో ముఖేష్ అంబానీ లక్షల కోట్ల సంపద ఆవిరి, రిలయన్స్ను దాటిన TCS