మేక్ ఇన్ ఇండియా లక్ష్యాలకు చైనా కొత్త అడ్డంకులు… దీనికి భారత వ్యూహం ఎలా ఉండబోతుంది?

చైనా నుంచి వచ్చిన తాజా ఎగుమతి ఆంక్షలు ఇప్పుడు భారత తయారీ రంగానికి కొత్త తలనొప్పి తెచ్చి పెట్టనున్నాయి. ఈసారి చైనా, రేర్ ఎర్త్ అయస్కాంతాలు(Rare Earth Magnets)ను కలిగి ఉన్న భాగాలపైన కూడా పరిమితులు విధించింది. దీంతో ఆటోమొబైల్, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, ఇండస్ట్రియల్ మెషినరీ రంగాల్లో పనిచేస్తున్న భారత కంపెనీలు మళ్లీ ఒత్తిడిలో పడే అవకాశం ఉంది. ఈ చర్యల్లో ఆసక్తికరంగా ఉన్నది ఏమిటంటే, జీఎస్టీ తగ్గింపుల వల్ల డిమాండ్ పెరిగి, కంపెనీలు తిరిగి ఊపందుకుంటున్న సమయంలోనే చైనా ఈ నిర్ణయం తీసుకుంది.

చైనా రేర్ ఎర్త్ మాగ్నెట్స్ మార్కెట్లో ప్రపంచంలో అతి పెద్ద ఉత్పత్తిదారు. గ్లోబల్ మార్కెట్లో దాదాపు 85% వాటా చైనా చేతిలోనే ఉంది. గతంలో కూడా చైనా కొన్ని సందర్భాల్లో ఎగుమతులపై ఆంక్షలు విధించడంతో, ప్రపంచంలోని సప్లై చైన్‌లు పలు దేశాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అందుకే, ఈసారి చైనా కొత్త ఎగుమతి పరిమితులు తీసుకోవడం కూడా భారత పరిశ్రమ పై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉందని స్పష్టంగా అర్థమవుతుంది.

China s Export Ban On Rare Earth Magnet Could Disrupt Indian Automotive amp amp Electronics Sectors

ఆటోమొబైల్ రంగంలోని సీనియర్ ప్రతినిధులు చెబుతున్న దాని ప్రకారం, ఈ ఆంక్షలు లైట్ రేర్ ఎర్త్ మాగ్నెట్స్, సబ్ అసెంబ్లీస్, కంపోనెంట్స్ దిగుమతుల పై నేరుగా ప్రభావం చూపనున్నాయి. ఇప్పటి వరకు భారత్‌లోని తయారీదారులు చైనా హెవీ రేర్ ఎర్త్ మాగ్నెట్స్ ఎగుమతులపై ఉన్న పాత ఆంక్షలను ఎదుర్కొనేందుకు లైట్ మాగ్నెట్స్‌ను తాత్కాలిక పరిష్కారంగా ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు వాటి పైనా అడ్డంకులు రావడం వల్ల పరిస్థితి మరింత క్లిష్టం చేస్తోంది.

ఒక సీనియర్ ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్ మాట్లాడుతూ, "ఇప్పుడే ప్రకటించిన ఈ పరిమితుల పరిధి చాలా పెద్దది. ఏ రంగాన్నీ వదిలిపెట్టడం లేదు అది ఏరోస్పేస్, డిఫెన్స్, ఆటోమొబైల్స్, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ లేదా ఇండస్ట్రియల్ మెషినరీ ప్రతి సెక్టార్‌కి ఇది తాకుతుంది," అని అన్నారు. ఇంకో ప్రతినిధి చెప్పినదాని ప్రకారం, "భారత కంపెనీలు చైనాలో నుంచి ట్రాక్షన్ మోటార్లు, రోటరీ అసెంబ్లీలు, బ్యాటరీ సిస్టమ్స్‌కు అవసరమైన ఎలక్ట్రానిక్ భాగాలను దిగుమతి చేసుకోవడం మొదలుపెట్టాయి. కానీ ఈ సరఫరాల పై కూడా కొత్త పరిమితులు వస్తే, అందరికీ దెబ్బ తగులుతుంది," అని తెలిపారు.

భారతదేశంలో టాప్ 10 మ్యూచువల్ ఫండ్స్ 2025

రేర్ ఎర్త్ మాగ్నెట్స్ అంటే సాధారణమైనవి కావు. ఇవి ఎలక్ట్రిక్ వాహనాల మోటార్లలో ఉపయోగించే 12కి పైగా కీలక భాగాల్లో వీటిని ఉపయోగిస్తారు. ఇవి లేకుండా వాహన వేగం గుర్తించే సిస్టమ్స్ గానీ, ఆటోమేటిక్ గేర్ షిఫ్టింగ్ సిస్టమ్స్ గానీ సరిగ్గా పనిచేయవు. చైనా వాణిజ్య మంత్రిత్వశాఖ జారీ చేసిన కొత్త మార్గదర్శకాల ప్రకారం, ఏ భాగంలోనైనా రేర్ ఎర్త్ మాగ్నెట్ విలువ మొత్తం భాగం విలువలో 0.1% కంటే ఎక్కువ ఉంటే, నవంబర్ 8 నుంచి స్థానిక అధికారుల అనుమతి లేకుండా ఆ భాగాన్ని ఎగుమతి చేయడం కుదరదు.

చైనాలో కొత్త ఎగుమతి ఆంక్షల వల్ల భారత పరిశ్రమపై దీర్ఘకాలంలో కూడా ఎక్కువ ప్రభావం పడే అవకాశం ఉంది. రేర్ ఎర్త్ మాగ్నెట్స్‌ పై అధికంగా ఆధారపడే ఎలక్ట్రిక్ వాహనాల (EV) రంగం మొదటగా దెబ్బతినే రంగాల్లో ఒకటి అవుతుంది. ఈ ప్రభావం వల్ల ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తున్న 'మేక్ ఇన్ ఇండియా', ఆటోమొబైల్ రంగంలో లోకలైజేషన్ (స్థానిక ఉత్పత్తి) లక్ష్యాలు బలహీనపడే ప్రమాదం ఉంది. సరఫరాలో అంతరాయం రావడం, ప్రత్యామ్నాయ భాగాలను దిగుమతి చేసుకోవాల్సి రావడం వల్ల తయారీ ఖర్చులు పెరుగుతాయి. ఖర్చులు పెరగడం వల్ల భారత కంపెనీలు అంతర్జాతీయ మార్కెట్లో తమ ఉత్పత్తులను పోటీ ధరలకు అమ్మడం కష్టమవుతుంది. దీంతో ఎగుమతులపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. అంతేకాకుండా, ఈ అనిశ్చితి కారణంగా EV మరియు ఎలక్ట్రానిక్స్ రంగాల్లో కొత్త పెట్టుబడులు లేదా ప్రాజెక్టులు వాయిదా పడే అవకాశం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు.

చైనా కొత్త ఎగుమతి పరిమితులు భారత తయారీ రంగానికి మరో పెద్ద సవాలుగా మారబోతున్నాయి. ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ వెహికల్ రంగం, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, ఇండస్ట్రియల్ ఉత్పత్తులు ఈ ప్రభావాన్ని బలంగా అనుభవించే అవకాశం ఉంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+