కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆర్థికవ్యవస్థలు కుప్పకూలాయి. ప్రపంచ దేశాల్లో కేవలం చైనా, ఆ తర్వాత భారత్ మాత్రమే త్వరగా కోలుకుంటాయని ఆర్థికవేత్తల అంచనా. చైనా అయితే ప్రతికూల వృద్ధి రేటు నమోదు చేయదని తెలిపారు. అందుకు తగినట్లే ఈ క్యాలెండర్ ఇయర్ రెండో క్వార్టర్లో డ్రాగన్ వృద్ధి రేటు 3.2 శాతంగా నమోదయింది. కరోనా మహమ్మారి నుండి ఈ దేశం వేగంగా కోలుకుంటోందని ఈ లెక్కలు చెబుతున్నాయి. భారత్లోను ఆర్థికకార్యకలాపాలు ప్రారంభమయ్యాయి.

రెండో క్వార్టర్లో భారీగా పుంజుకొని..
ఏడాది క్రితం ఇదే క్వార్టర్తో పోలిస్తే ఈసారి 3.2 శాతం వృద్ధిని నమోదు చేసినట్లు చైనా నివేదించింది. ఏప్రిల్ నుండి జూన్ మధ్య 2.5 శాతం వృద్ధి రేటు నమోదవుతుందని అంచనా వేశారు. కానీ ఊహించిన దాని కంటే ఎక్కువగా కనిపించింది. మొదటి క్వార్టర్ (జనవరి-మార్చి)లో చూసిన క్షీణత నుండి పుంజుకుందని తెలిపింది. కరోనా మహమ్మారి పుట్టింది చైనాలోని వూహాన్లో. దీంతో అక్కడ లాక్ డౌన్ విధించారు. ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించేందుకు ఉద్దీపన చర్యలు ప్రారంభించారు.

చైనా లెక్కలు సరే.. కానీ అనుమానాలు
ప్రపంచ రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనా మొదటి క్వార్టర్లో వృద్ధి రేటు 6.8 శాతం ప్రతికూలత నమోదు చేసింది. 1992 నుండి చైనాకు వరస్ట్ క్వార్టర్ జనవరి - మార్చి 2020 కావడం గమనార్హం. అయితే రెండో క్వార్టర్లో పుంజుకుంది. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు శుభసూచకంగా భావిస్తున్నారు. అయితే ఇక్కడ ఓ అనుమానం ఉంది. కానీ చైనా ఏ విషయం చెప్పినా.. అందులో మిగతా ప్రపంచానికి అనుమానాలు ఉంటాయి. ఆర్థిక వ్యవస్థ మొదలు చైనా నివేదికల్లోని కచ్చితత్వం సందేహాలనే మిగుల్చుతాయి.

అదే నిజమైతే మంచి సంకేతం
కరోనా నుండి బయటపడుతున్నామని, ఈ మహమ్మారి ప్రభావాన్ని తమ ఆర్థిక వ్యవస్థ అధిగమించి కోలుకుంటోందని చైనా నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ విడుదల చేసింది. ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించేందుకు ఎన్నో చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. ఖర్చులు పెంచడం, వడ్డీ రేట్లు తగ్గించడం సహా వివిధ చర్యలు తీసుకుందని పేర్కొంది. చైనా కచ్చితత్వంపై అనుమానాలు ఉన్నప్పటికీ, అదే వాస్తవమైతే మాత్రం ప్రపంచానికి మంచి సంకేతమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

భారత్కు కూడా సానుకూలం...
అంతేకాదు, జూన్ నెలలో డాలర్ వ్యాల్యూలో ఎగుమతులు, దిగుమతులు పెరిగాయి. మే నెలతో పోలిస్తే జూన్ నెలలో మ్యానుఫ్యాక్చరింగా కార్యకలాపాలు కూడా పెరిగాయి. ఇతర దేశాలతో పోలిస్తే చైనాలో లాక్ డౌన్ ప్రభావం తక్కువగా ఉందని చెబుతున్నారు. రాబోయే రెండు క్వార్టర్లలోను ఆర్థిక వృద్ధి స్థిరంగా ఉంటుందని భావిస్తున్నారు. రానున్న క్వార్టర్లలో 5 శాతానికి చేరుకోవడం ఖాయమని, పూర్తి ఏడాదికి 6.1 శాతంగా నమోదు కావొచ్చునని చెబుతున్నారు. ఆర్థికవేత్తల అంచనా మేరకు చైనా పుంజుకుంటే.. ప్రపంచ దేశాల్లో చైనా తర్వాత భారత్ ఆర్థిక వ్యవస్థ భేష్ అని గతంలోనే భావించారు. ఐఎంఎఫ్ వంటివి కూడా వెల్లడించాయి. దానికి తగినట్లు భారత్లో కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయి. చైనా పుంజుకోవడం భారత్ అంచనాలకు కూడా సానుకూల పరిణామంగా చెబుతున్నారు.
More From GoodReturns

యుద్దం ఆపడం మా చేతుల్లో ఉంది.. నీ చేతుల్లో కాదు.. ట్రంప్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ విసిరిన ఇరాన్..

ఇరాన్ యుద్దం ముగుస్తుందనే అంచనాలు.. తగ్గిన ముడి చమురు ధరలు.. ట్రంప్ ఏమన్నారంటే..

ముంచుకొస్తున్న 1970 చమురు సంక్షోభం.. ధరల పెరుగుదలతో పలు దేశాలు విలవిల..

భారత్ టైర్ పరిశ్రమను కుదిసేస్తున్న ఇరాన్ యుధ్ద ప్రభావం.. కీలకమైన హెచ్చరిక చేసిన CLSA

యుద్ధాన్ని వదిలి బంగారంపై కన్నేసిన చైనా.. టన్నుల కొద్ది పసిడి రహస్యంగా కొనుగోలు.. ధరల పెరుగదలపై ఆందోళన..

రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు.. అందువల్లే అనుమతి ఇచ్చామని తెలిపిన అమెరికా..

Oil prices: జపాన్ రహస్య ఆయిల్ నిధి! ఆరు నెలలకు సరిపడా చమురుని జపాన్ ఎలా దాచిపెట్టింది?

అమెరికాలో ఛాయ్ వాలాగా మారిన భారత ఐటీ ఉద్యోగి.. రోజూ వారి సంపాదన చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

Russian oil: ట్రంప్ క్లెయిమ్ VS రియాలిటీ.. రష్యా ఆయిల్ కొనుగోలుపై క్లారిటీ ఇచ్చిన న్యూఢిల్లీ!

పశ్చిమాసియాలో యుద్ధం.. చమురు ధరల్లో భారీ పెరుగుదల.. ఎంతలా ఎగబాకాయంటే..

విశ్వ విజేతగా భారత్.. కళ్లు చెదిరే నజరానా.. ICC Men's T20 World Cup 2026 ప్రైజ్ మనీ పూర్తి వివరాలు ఇవే..



Click it and Unblock the Notifications