China's Brahmaputra Project: హిమాలయాల మంచుకొండల నుంచి పుట్టిన యార్లుంగ్ త్సాంగ్పో నది.. టిబెట్ను దాటి భారతదేశంలోకి బ్రహ్మపుత్ర నదిగా ప్రవేశిస్తుంది. ఆ తర్వాత బంగ్లాదేశ్ వరకు ప్రవహిస్తూ, లక్షలాది మందికి సాగునీరు, తాగునీరు, ఉపాధిని అందిస్తోంది. అలాంటి నదిపై చైనా చేపట్టిన భారీ జలవిద్యుత్ ప్రాజెక్టు ఇప్పుడు కేవలం ఒక అభివృద్ధి కార్యక్రమంగా కాకుండా.. దక్షిణాసియా భవిష్యత్తును ప్రభావితం చేసే అంశంగా మారుతోంది.
సుమారు 168 బిలియన్ డాలర్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ జలవిద్యుత్ వ్యవస్థను చైనా ఇప్పటివరకు చేపట్టిన అతిపెద్ద, అత్యంత వివాదాస్పద మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో ఒకటిగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. నది ప్రవాహంలో దాదాపు 2 వేల మీటర్ల ఎత్తును వినియోగించుకుని భారీగా విద్యుత్ ఉత్పత్తి చేయాలన్నది బీజింగ్ లక్ష్యంగా కనిపిస్తోంది. చైనా దీన్ని వాతావరణానికి అనుకూలమైన స్వచ్ఛ శక్తి ప్రాజెక్టుగా ప్రచారం చేస్తున్నప్పటికీ.. దీని ప్రభావాలు తీవ్రంగా ఉంటాయని పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.ఈ ప్రాజెక్టు సాంకేతికంగా అత్యంత సంక్లిష్టమైనదిగా భావిస్తున్నారు.
డ్యామ్లు, రిజర్వాయర్లు, భూగర్భ విద్యుత్ కేంద్రాలు అన్నీ సొరంగాల ద్వారా అనుసంధానించబడేలా నిర్మాణం జరగనుంది. అంతర్జాతీయ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇంత పెద్ద స్థాయిలో నది సహజ ప్రవాహంలో జోక్యం చేసుకోవడం వల్ల దాని లయ పూర్తిగా మారిపోయే ప్రమాదం ఉంది. అవక్షేపాల కదలికలు, చేపల వలస మార్గాలు, కాలానుగుణ వరదల నమూనాలు అన్నీ దెబ్బతినవచ్చు. ఇవన్నీ దిగువ ప్రాంతాల్లో వ్యవసాయం, జీవవైవిధ్యానికి కీలకమైన అంశాలుగా ఉండటం వల్ల అడ్డుకట్టపడితే తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉందని సూచిస్తున్నారు.

భారతదేశానికి ఈ ప్రాజెక్టు మరింత ఆందోళన కలిగిస్తోంది. బ్రహ్మపుత్రకు ప్రధానంగా రుతుపవనాల వర్షాలు, ఉపనదుల ద్వారా నీరు లభించినప్పటికీ, ఎగువన జరిగే మార్పులు నది సహజ నాడిని దెబ్బతీస్తాయని నిపుణులు చెబుతున్నారు. చైనా ఎప్పుడు నీటిని నిలిపివేస్తుందో, ఎప్పుడు భారీగా విడుదల చేస్తుందో తెలియని పరిస్థితి వల్ల వరదలు లేదా కరువు ఏర్పడే ప్రమాదం ఉందని అరుణాచల్ ప్రదేశ్ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చైనా చేపట్టిన ఈ ప్రాజెక్టును ఒక వాటర్ బాంబ్ గా అభివర్ణిస్తున్నారు.
పర్యావరణ సమస్యలకే కాకుండా, ఈ ప్రాజెక్టుకు గట్టి భౌగోళిక రాజకీయ కోణం కూడా ఉంది. టిబెట్, భారత సరిహద్దు వెంబడి చైనా చేపడుతున్న మౌలిక సదుపాయాల అభివృద్ధి వ్యూహాత్మకంగా రూపొందించబడిందని విశ్లేషకులు భావిస్తున్నారు. సహజ వనరుల నియంత్రణ ద్వారా సరిహద్దు ప్రాంతాలపై పట్టు సాధించాలన్నది బీజింగ్ దీర్ఘకాలిక లక్ష్యంగా చెబుతున్నారు. టిబెట్ ప్రాంతంలో మౌలిక సదుపాయాలను పెంచడం ద్వారా భారత్తో ఉన్న సరిహద్దులపై నియంత్రణను బలోపేతం చేయాలన్నది చైనా వ్యూహంగా భావిస్తున్నారు. మెకాంగ్ నది విషయంలో కూడా ఇలాగే డ్యామ్లను నిర్మించి, దిగువ దేశాల్లో కరువుకు కారణమైందన్న ఆరోపణలు ఇప్పటికే ఉన్నాయి.
ఈ మెగా ప్రాజెక్టు వల్ల టిబెట్లోని మోన్పా, లోబా వంటి స్థానిక తెగలకు చెందిన వేలాది మంది ప్రజలు తమ పూర్వీకుల భూములను వదులుకోవాల్సి వస్తోంది. బలవంతపు తరలింపుల వల్ల వారి సంస్కృతి, ఉపాధి వనరులు నాశనమవుతున్నాయని మానవ హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. స్థానికుల స్థానంలో ఇతర ప్రాంతాల వలస కార్మికులను తీసుకురావడం ద్వారా ఆ ప్రాంత జనాభా స్వరూపాన్ని మార్చే ప్రయత్నం జరుగుతోందన్న విమర్శలు కూడా ఉన్నాయి.
ఈ పరిణామాల మధ్య.. చైనా చర్యలను భారత్ నిశితంగా గమనిస్తోంది. ఇందులో భాగంగానే బ్రహ్మపుత్రపై సుమారు 11,200 మెగావాట్ల సామర్థ్యం గల డ్యామ నిర్మాణాన్ని ప్రతిపాదించింది. అయితే, ఇరు దేశాల మధ్య డ్యామ్ నిర్మాణ పోటీ పర్యావరణానికి మరింత ముప్పు తెస్తుందని అంతర్జాతీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. చర్చలు, పరస్పర అవగాహన లేకుండా ముందుకెళ్తే భవిష్యత్తులో దక్షిణాసియాలో నీటి భద్రత పెద్ద సంక్షోభంగా మారే ప్రమాదం ఉందని వారు సూచిస్తున్నారు.
More From GoodReturns

హార్ముజ్ జలసంధిని దాటిన మరో రెండు భారత LPG నౌకలు.. మరో మూడు షిప్పులు ఇంకా అక్కడే..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications