ట్రంప్ సుంకాలు బాదుడు.. భారత్‌కు కీలక మద్దతు ప్రకటించిన చైనా, వాటి సరఫరాకు ఒకే..

ఈ మధ్యకాలంలో ఉద్రిక్తతల మధ్య కొనసాగిన భారత్-చైనా సంబంధాలు మళ్లీ సాధారణపరిస్థితుల వైపు దారి మళ్లుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ట్రంప్ సుంకాల బాదుడుతో పొరుగుదేశం చైనా భారతదేశానికి అనుకూలంగా మారిందనే తాజా పరిణామాలు తెలియజేస్తున్నాయి. భౌగోళికంగా రెండు దేశాల మధ్య సరిహద్దు సమస్యలు ఉన్నప్పటికీ వాణిజ్యపరంగా ఈ రెండు దేశాలు సహకారం అందించుకుంనేందుకు రెడీ అయ్యాయి. ఈ నేపథ్యంలో China విదేశాంగ మంత్రి వాంగ్ యి న్యూఢిల్లీలో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌తో సమావేశమయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా ద్వైపాక్షిక వాణిజ్య, సరఫరా గొలుసు అంశాలపై చర్చ జరిగిందని అధికార వర్గాలు తెలిపాయి.

ఈ భేటీలో భారతదేశానికి పెద్ద ఉపశమనం ఇస్తూ ఎరువులు, అరుదైన భూమి ఖనిజాలు (Rare Earth Minerals), అలాగే టన్నెల్ బోరింగ్ యంత్రాలపై విధించిన ఎగుమతి పరిమితులను సడలిస్తామని చైనా ప్రభుత్వం హామీ ఇచ్చింది. రెండు దేశాల మధ్య ఉన్న వ్యవధులను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చైనా ద్వైపాక్షికంగా వెల్లడించింది. గత సంవత్సరం చైనా ఈ ఉత్పత్తులపై ఎగుమతి పరిమితులు విధించడంతో భారత కార్యకలాపాలపై ప్రత్యక్ష ప్రభావం పడింది. ఎరువుల సరఫరా రబీ సీజన్ నాటికి తీవ్రమైన అవాంతరాలు కలిగించగా, టన్నెల్ బోరింగ్ యంత్రాలపై పరిమితుల వల్ల నగర రవాణా, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఆలస్యం అయ్యాయి.

China lifts export restrictions fertilizers export to India rare earth exports India China Beijing eases trade curbs India China trade relations rare earth supply India China export policy shift fertilizer supply India India China diplomatic update

జైశంకర్ ఇటీవలి చైనా సందర్శన సందర్భంలో ఈ అంశాలను స్వయంగా వాంగ్ యి దృష్టికి తీసుకువెళ్లగా, ఇప్పుడు దానికి ముందస్తు సానుకూల స్పందన లభించడం ద్వైపాక్షిక సంబంధాలలో తాజా మార్పునకు ప్రతినిధి అని అధికారులు పేర్కొన్నారు. విదేశాంగ శాఖ వర్గాల ప్రకారం.. సుదీర్ఘ చర్చల తరువాత చైనా.. భారతదేశం వ్యక్తం చేసిన ఆందోళనలను పరిగణనలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకుంది. DAP (డై అమోనియం ఫాస్ఫేట్) వంటి ఎరువులపై ఉన్న పరిమితులు రబీ సీజన్‌లో భారత రైతులకు ఇబ్బందులు కలిగిస్తుండగా, ఇప్పుడు సరఫరా తిరిగి సాధారణ స్థితికి వచ్చే అవకాశముందని అధికారులు తెలిపారు.

భారత-చైనా సరిహద్దు సమస్యలు ఇప్పటికీ పూర్తి పరిష్కార దశలోకి వెళ్ళలేదు. అధికార వర్గాల ప్రకారం, ఈ అంశంపై జాతీయ భద్రతాపాలకుడు (NSA) అజిత్ దోవల్ అత్యంత త్వరలో వాంగ్ యితో ప్రత్యేకంగా సమావేశమై 3,488 కిలోమీటర్ల వాస్తవ నియంత్రణ రేఖ (LAC)లో బలగాల స్థితిగతులని తగ్గించబడే మార్గాలపై చర్చ చేయనున్నారు. లడఖ్‌లోని పలు ప్రాంతాల్లో భారత-చైనా సైనిక బలగాలు ఇప్పటికీ మోహరించబడి ఉన్నాయని అధికార వర్గాలు గుర్తుచేశాయి.

ఈ నేపథ్యంలో చైనా తాలూకు ఎరువులు భారతదేశానికి సుమారు 30 శాతం వరకు సరఫరా అయ్యే అవకాశముందని వచ్చిన హామీ ప్రకటన పరిశ్రమ రంగాలకు కొంత ఊరటనిచ్చింది. అదే విధంగా, అరుదైన భూ ఖనిజాలు, టన్నెల్ బోరింగ్ యంత్రాల సరఫరా పునఃప్రారంభమైతే, పట్టణ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు మరల వేగం పట్టే అవకాశాలు ఉన్నాయి.ఈ తాజా నిర్ణయంతో మల్టీ బిలియన్ డాలర్ మెట్రో, టన్నెల్ ప్రాజెక్టులు వేగం పుంజుకునే అవకాశం ఉంది.

అరుదైన భూమి అయస్కాంతాల కొరతను అధిగమించేందుకు కేంద్రం ఇప్పటికే రూ.1,345 కోట్ల విలువైన సబ్సిడీ పథకంను తుది రూపంలో సిద్ధం చేసింది. దేశీయ పరిశ్రమలు స్వదేశంలోనే ఆయా మూలకాలను తవ్వి ప్రాసెస్ చేయడానికి అవసరమైన మద్దతు అందించనున్నట్లు భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. వ్యవసాయం, పరిశ్రమ, మౌలిక సదుపాయ రంగాలపై ప్రత్యక్షంగా ప్రభావం చూపే ఈ సరఫరా సడలింపులతో వచ్చే కొన్ని నెలల్లో భారత ఉత్పత్తి కార్యకలాపాల మళ్లీ వేగం పుంజుకునే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+