భారత్ దెబ్బకు పాక్ విలవిల.. కేజీ చికెన్ రూ.800, బియ్యం రూ.340.. కష్టాల అంచున పాకిస్థాన్ !

India Pakistan Relation: ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పాకిస్తాన్ ప్రస్తుతం ద్రవ్యోల్బణంతో కొట్టుమిట్టాడుతుంది. పహల్గామ్‌లో తీవ్రవాదులు కాల్పుల దాడికి పాల్పడటంతో ఒక విధంగా తనకు తానుగా సమాధి తవ్వుకున్నట్టు అయ్యింది. ద్రవ్యోల్బణం కారణంగా మన పక్క దేశం అయినా పాకిస్థాన్లో తీవ్ర గందరగోళం నెలకొంది. తాజాగా చూస్తే పాకిస్తాన్‌లో బియ్యం కిలో రూ.340కి, చికెన్ కిలో రూ.800కి అమ్ముతున్నారు. దింతో భారతదేశ వాణిజ్య నిషేధం తర్వాత పాకిస్తాన్ ఇప్పుడు లోతైన సంక్షోభంలో చిక్కుకున్నట్లు కనిపిస్తోంది.

Chicken price at Rs 800 per kg rice at Rs 340 per kg in Pakistan this move of India brings troubles in Pakistan

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశం పాకిస్తాన్‌తో వాణిజ్యాన్ని నిషేధించిన సంగతి మీకు తెలిసందే. అయితే ఈ ఉగ్రవాద దాడిలో 26 మంది పర్యాటకులు మరణించారు. భారతదేశ ఈ చర్య కారణంగా ద్రవ్యోల్బణ ప్రభావం అక్కడి ప్రజలపై మరింత భయంకరంగా మారింది.

3800 కోట్ల వ్యాపారం: 2023 సంవత్సరంలో భారతదేశం అండ్ పాకిస్తాన్ మధ్య అట్టారి-వాఘా సరిహద్దు ద్వారా దాదాపు రూ.3800 కోట్ల విలువైన వాణిజ్యం జరిగింది అంటే దీని బట్టి మీరు అంచనా వేయవచ్చు. ఇందులో మందులు, కోళ్ల మేత, పండ్లు, కూరగాయలు అలాగే రసాయనాలు ఉన్నాయి. కానీ పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశం ఈ సరిహద్దు చెక్ పోస్ట్‌ను లాక్ చేసింది.

పాకిస్తాన్ ఫార్మా పరిశ్రమ 30 నుండి 40 శాతం ముడి పదార్థాల కోసం భారతదేశంపై నేరుగా ఆధారపడి ఉంది. భారతదేశం నుండి సప్లయ్ ఆగిపోయిన వెంటనే పాకిస్తాన్‌లో వైద్య సంక్షోభం తీవ్రతరం కావడం మొదలైంది. నివేదికల ప్రకారం, పాకిస్తాన్ ఆరోగ్య అధికారులు ఇప్పుడు మందుల సప్లయ్ ఎలాగైనా నిర్వహించగలిగేలా ఏమార్చెన్సీ ప్లాన్స్ రూపొందిస్తున్నారు.

రూ.800కి అమ్ముతున్న కిలో చికెన్: మన పక్క దేశంలో ద్రవ్యోల్బణ పరిస్థితి ఎలా ఉందంటే, చికెన్ కిలో రూ. 800 (PKR)కి, బియ్యం కిలో రూ. 340కి అమ్ముతున్నారు. అంతే కాకుండా, పాలు లీటరుకు రూ.224కు లభిస్తాయి. సింధు జల ఒప్పందంపై నిషేధం కారణంగా నీటి సంక్షోభం కూడా తీవ్రమైంది. నేడు పరిస్థితి ఎలా ఉందంటే వాటర్ బాటిల్ ధర పాకిస్తానీ కరెన్సీ తో పోల్చితే రూ.105 చేరుకుంది. ఇలాంటి పరిస్థితిలో రాబోయే రోజుల్లో పాకిస్తాన్‌లోని సామాన్య ప్రజల జీవితం మరింత కష్టంగా మారవచ్చు.

భారతదేశం తీసుకున్న నిర్ణయాల ప్రభావం పాకిస్తాన్ స్టాక్ మార్కెట్‌పై కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఆ దేశ స్టాక్ మార్కెట్ రోజురోజుకి మరింతగా దిగజారుతోంది అంతేకాకుండా పెట్టుబడిదారులు కుడ డబ్బును కోల్పోతున్నారు. మరోవైపు, పాకిస్తాన్ విదేశీ మారక నిల్వలు కూడా $15.75 బిలియన్లకు తగ్గిపోయాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+