Milk import: హరిత విప్లవం, శ్వేత విప్లవం, నీలి విప్లవాల ద్వారా దేశాన్ని వ్యవసాయం, పాల ఉత్పత్తి, ఆక్వా రంగాల్లో స్వయం సమృద్ధిగా తీర్చిదిద్దడానికి అప్పటి పాలకులు బాటలు వేశారు. వాటి ఫలితంగా ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారుగా ఇండియా మంచి పేరు గడించింది. అయితే 12 సంవత్సరాల తర్వాత, 2024 ఎన్నికలకు ముందు.. ధరలను తగ్గించడానికి, సరఫరా పరిమితులను సరిచేయడానికి ప్రభుత్వం పాల ఉత్పత్తులను దిగుమతి చేసుకోనుందని వార్తలు వస్తున్నాయి.
గతంతో పోలిస్తే ఇప్పుడు పాల ఉత్పత్తి శాతం కొంత స్తబ్దుగా ఉందని పశుసంవర్ధక శాఖ సీనియర్ అధికారి ఒకరు అభిప్రాయపడినట్లు ప్రముఖ మీడియా సంస్థ పేర్కొంది. సాధారణంగా ఉత్పత్తి సంవత్సరానికి 6 శాతం వృద్ధి చెందుతుండగా.. ఈ ఏడాది అది నిలిచిపోయినట్లు తెలిపారు. కానీ సహకార రంగానికి సంబంధించిన డేటాను పరిశీలిస్తే 2 శాతం వృద్ధి నమోదైనట్లు పేర్కొన్నారు. ఇందులో ప్రైవేట్ రంగాన్ని పరిగణనలోకి తీసుకోలేదన్నారు.

వాస్తవానికి ఈ ఏడాది 8-10 శాతం డిమాండ్ పెరిగినట్లు పశుసంవర్ధక శాఖ మరియు డెయిరీ కార్యదర్శి రాజేష్ సింగ్ వెల్లడించారు. ఇది కొవిడ్ -19 వల్ల అణచివేయబడిన డిమాండ్ ఇప్పుడు పుంజుకున్నట్లు భావిస్తున్నామన్నారు. పాల సరఫరాపై పరిమితులు లేవనీ.. కొవ్వులు, నెయ్యి, వెన్న విషయంలో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉండవచ్చని తెలిపారు. అంతగా అవసరమైతే ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందని చెప్పారు.
భారతదేశం పాల ఉత్పత్తులను దిగుమతి చేసుకునే అవకాశం గురించి కొన్ని తప్పుదోవ పట్టించే వార్తా నివేదికలు వచ్చినట్లు సింగ్ తెలిపారు. ఇవి రైతులతో పాటు ఇతర వాటాదారుల్లో ఆందోళనకు దారితీసిందన్నారు. పాల ఉత్పత్తుల దిగుమతులకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన వెల్లడించారు. ఏవైనా నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తే రైతుల ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు.
నెయ్యి, వెన్న వంటి పాల ఉత్పత్తులను దిగుమతి చేసుకునేందుకు ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయాన్నైనా పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు NCP అధినేత శరద్ పవార్ వెల్లడించారు. ఈ తరహా చర్యలు దేశీయ పాల ఉత్పత్తిదారుల ఆదాయాన్ని ప్రభావితం చేస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా సంక్షోభం నుంచి ఇటీవలే బయటపడిన పాడి రైతులు పునరుద్ధరణ ప్రక్రియకు ఈ నిర్ణయం తీవ్ర ఆటంకం కలిగిస్తుందన్నారు.
అయితే 2024లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఆహార ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడం కేంద్ర ప్రభుత్వానికి సవాలుగా మారింది. ఇచ్చిన వాగ్ధానాన్ని అమలు చేసేందుకు గాను పాడి, పశుసంపద సహా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే దిశగా కృషి చేస్తోంది. వినియోగదారుల ధరల సూచికలో ఆహార వస్తువులకు 46 శాతం వెయిటేజీ ఉండగా.. వీటిలో పాలు మరియు పాల ఉత్పత్తులకు 6.61 శాతం ప్రాముఖ్యత ఉంది. కాబట్టి డెయిరీ విభాగంలో 1 శాతం ధరల పెరుగుదల కూడా CPIపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ఈ పరిస్థితుల్లో మోడీ సర్కారు ఏం చేస్తుందో వేచి చూడాలి మరి!
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications