న్యూఢిల్లీ: కొంతకాలంగా పన్ను చెల్లింపుదారులు ఎదుర్కొంటోన్న ఇబ్బందులు అన్నీ, ఇన్నీ కావు. ఆదయాపు పన్నులకు సంబంధించిన రిటర్నులను దాఖలు చేయడంలో అనేక ఇక్కట్లను చవి చూశారు. తమ ప్రమేయం లేకుండానే, తమ తప్పేమీ లేకుండానే వేల కోట్ల రూపాయల మేర అదనపు జరిమానాలను భరించారు.. ఆలస్యపు రుసుములను చెల్లించారు. ఇలాంటి ఇక్కట్లను ఎదుర్కొన్న వారిలో దేశవ్యాప్తంగా 22.75 లక్షల మంది ఆదాయపు పన్ను చెల్లింపుదారులు ఉన్నారు.
లోపం ఎక్కడ ఉందో కాస్త ఆలస్యంగానైనా తెలుసుకోగలిగింది కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ. ఐటీ రిటర్నులను దాఖలు చేయడానికి కొత్తగా అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ-ఫైలింగ్ పోర్టల్లోనే అసలు సమస్య ఉందని నిర్ధారించింది. దీనితో- ఆదాయపు పన్ను చెల్లింపుదారుల నుంచి వసూలు చేసిన ఆలస్యపు రుసుము, అదనపు జరిమానాలను వెనక్కి ఇచ్చేసింది. ఇలా వెనక్కి తిరిగి చెల్లించిన మొత్తం 49 వేల కోట్ల రూపాయలకు పైమాటే.

కాగా- ఐటీ రిటర్నులను దాఖలు చేయడానికి అత్యంత సులభ పద్ధతి ఇ-ఫైలింగ్ పోర్టల్ ఒక్కటే కావడం వల్ల లక్షలాది మంది దీని మీదే ఆధారపడ్డారు. ఈ పోర్టల్ను డెవలప్ చేసింది మైక్రోసాఫ్ట్. ఆ కంపెనీ మళ్లీ.. అందులోని లోపాలను సరి చేసింది. దీనితో నాలుగు రోజుల వ్యవధిలోనేే నాలుగు లక్షలకు పైగా ఐటీ రిటర్నులు దాఖలయ్యాయి. ఇంకా లక్షలాదిగా ఐటీ రిటర్నులు దాఖలు కావాల్సి ఉందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అంచనా వేస్తోంది.
ఈ పోర్టల్లో సాంకేతిక లోపాలను తొలగించిన తరువాత పెద్ద ఎత్తున తాకిడి నెలకొంది. దీనితో ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయడానికి ఉద్దేశించిన గడువును పొడిగించే అవకాశాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులు పరిశీలిస్తోన్నారు. దీనిపై ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఇప్పటిదాకా ఎనిమిది మిలియన్లకు పైగా ఐటీ రిటర్నులు దాఖలయ్యాయి. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఐటీ రిటర్నులను దాఖలు చేయడానికి ఉద్దేశించిన గడువుతో పోల్చుకుంటే.. ఇప్పుడు తాజాగా దాఖలైనవి కేవలం 14 శాతమే. ఇంకా లక్షల సంఖ్యలో అందాల్సి ఉన్నందున గడువు పొడించే అవకాశాలు లేకపోలేదు.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications