ప్రస్తుతం డిజిటల్ ప్రపంచం రాజ్యమేలుతోంది. ఎక్కడ చూసినా ఆన్ లైన్ షాపింగ్, క్యాష్ లెస్ పేమెంట్స్. భవిష్యత్తులో వీటి వాటా మరింత పెరగనుందని ఇప్పటికే నివేదికలు వెలువడ్డాయి. UPI వ్యవస్థ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇది నిజమేనని ఒప్పుకోక తప్పని పరిస్థితి. గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడి చెల్లింపులు చేసే స్థితి నుంచి, సెకన్లలో ఒక్క క్లిక్ తో పూర్తిచేసే అవకాశానికి కారణం ఈ నగదు రహిత లావాదేవీలే.

నగదు vs క్యాష్ లెస్:
దేశంలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్(UPI) ప్రాధాన్యత క్రమంగా పెరుగుతున్నందున త్వరలో డిజిటల్ లావాదేవీలు సింహభాగాన్ని ఆక్రమిస్తాయని ప్రధాని మోడీ తెలిపారు. నగదు చెల్లింపులను సైతం అధిగమిస్తాయన్నారు. సింగపూర్ తో UPI మరియు PayNow మధ్య క్రాస్ బోర్డర్ కనెక్టివిటీ ప్రారంభం సమావేశంలో ఈ మేరకు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆదేశ ప్రధానితో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోడీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇంతాగా వాడేస్తున్నారా..?
ఒక్క 2022లోనే రూ.126 ట్రిలియన్ల విలువైన 74 బిలియన్ల లావాదేవీలు UPI ద్వారా జరిగినట్లు ప్రధాని స్పష్టం చేశారు. వీటి విలువ దాదాపు 2 ట్రిలియన్ల సింగపూర్ డాలర్లకు సమానమన్నారు. ఇంత పెద్ద మొత్తంలో చెల్లింపులు జరుగుతున్నాయంటే, దేశీయంగా రూపొందించిన ఈ వ్యవస్థ అత్యంత సురక్షితమైనదని ప్రజలు విశ్వసిస్తున్నట్లు అర్థమని స్పష్టం చేశారు. కాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ మరియు మానిటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్ మేనేజింగ్ డైరెక్టర్ రవి మీనన్ ఈ సమావేశంలో మొదటి లావాదేవీని పూర్తిచేశారు.

ప్రవాసులకు ప్రయెజనకరంగా..
భారత UPI, సింగపూర్ PayNow అనే ఈ రెండు చెల్లింపు వ్యవస్థలను అనుసంధానించడం ద్వారా ఇరు దేశాల ప్రజలకూ ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. సరిహద్దులతో సంబంధం లేకుండా చెల్లింపులను వేగంగా, తక్కువ ఖర్చుతో బదిలీ చేయడానికి ఈ విధానం వీలు కల్పిస్తుందంటున్నారు. సింగపూర్ లోని ప్రవాస భారతీయులకు ముఖ్యంగా వలస కార్మికులు, విద్యార్థులకు మరింత మేలు చేస్తుందని ఆశిస్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని దేశాలకు UPI సేవలను విస్తరించాలని కేంద్రం స్థిర నిశ్చయంతో ఉంది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications