Paytm: భారీగా పడిన పేటీఎం స్టాక్.. ఇప్పుడు కొనుగోలు చేయవచ్చా..!
పేటీఎం కంపెనీ నోడల్ బ్యాంక్గా యాక్సిస్ బ్యాంక్తో టై-అప్ అయిన సంగతి తెలిసిందే. ఆర్బీఐ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (PPB) గడువును మార్చి 15 వరకు పొడిగించారు. ఈ నేపథ్యంలో Paytm షేర్లు సోమవారం లాభాలు ఉండే అవకాశం ఉంది. అయితే దీర్ఘకాలిక ఆందోళనలు కొనసాగుతున్నందున బౌన్స్ స్వల్పకాలికంగా ఉండవచ్చని బ్రోకర్లు అంచనా వేస్తున్నారు. పేటీఎం క్యూఆర్, సౌండ్ బాక్స్, కార్డ్ మెషీన్లు మార్చి 15 వరకు పని చేస్తాయని పేటీఎం తెలిపింది.
పేటీఎం ద్వారా డిజిటల్ చెల్లింపులను అంగీకరించే వ్యాపారులు యాక్సిస్ బ్యాంక్ నోడల్ బ్యాంక్తో దీన్ని కొనసాగించవచ్చని తెలిపింది. శుక్రవారం పేటీఎం స్టాక్ ఆరు సెషన్ల నష్టాల తర్వాత 5 శాతం పెరిగి రూ. 341.30 వద్ద ముగిసింది. అయితే జనవరి 31 పేటీఎం షేర్లు 55 శాతం క్షీణించాయి.
పేటీఎం స్టాక్ పడిపోవడంతో హెచ్ఎన్ఐలు, చిన్న పెట్టుబడిదారులు గత వారంలో ట్రేడింగ్ పేటీఎం షేర్లను భారీగా కొనుగోలు చేశారని బ్రోకర్లు తెలిపారు.

పేటీఎం వాలెట్ వ్యాపారాన్ని మూసివేయడం వల్ల ఆ కంపెనీకి లాభాలు తగ్గే అవకాశం ఉంది. ఆదాయం, లాభదాయకత మరియు వ్యాపార విస్తరణపై ప్రభావంపై మరికొంత స్పష్టత అవసరమని నిపుణులు చెబుతున్నారు. పేటీఎం దాని సేవలు, ప్రక్రియల సజావుగా పనితీరును తిరిగి ప్రారంభించడానికి దాని ప్రణాళికల గురించి పెట్టుబడిదారులను ఒప్పించవలసి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. స్టాక్ సరసమైన విలువపై అభిప్రాయాన్ని ఏర్పరుచుకునే ముందు పెట్టుబడిదారులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
ఆర్బీఐ 15 రోజుల పాటు పొడిగింపు ఇచ్చినప్పటికీ ఇది తాత్కాలిక ఉపశమనంగా భావించాలని చెబుతున్నారు. కంపెనీ నుండి అస్పష్టమైన ప్రకటనల కారణంగా పెట్టుబడిదారుల విశ్వాసం తక్కువగా ఉందన్నారు. షేరు రూ. 400 ఎగువన ఉంటే పెట్టుబడిదారులు అమ్మకాల-పెరుగుదల వ్యూహాన్ని అనుసరించాలని సూచించారు.
Note: ఈ వార్త కేవలం నిపుణులు అభిప్రాయం మాత్రమే. దీనికి గుడ్ రిటర్న్స్ తెలుగుకు సంబంధం లేదు.


Click it and Unblock the Notifications