అగ్రరాజ్యం అమెరికా అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు..ప్రపంచ దేశాలపై డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలను రద్దు చేసిన సంగతి విదితమే. ఇది చట్ట విరుద్ధమని తేల్చి చెప్పింది. ఈ తీర్పుతో ప్రపంచ దేశాలకు భారీ ఉపశమనం లభించింది. ముఖ్యంగా భారతదేశానికి ఇది చాలా మేలు చేసింది. దిగుమతి సుంకాలను ఏకపక్షంగా విధించే అధికారాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు లేదని కోర్టు స్పష్టం చేయడం ద్వారా.. భారత్-రష్యా ఇంధన వాణిజ్యంపై ఉన్న ఒత్తిడి కొంతవరకు తగ్గింది. ఈ పరిణామం నేపథ్యంలో, భారతదేశం రష్యా నుంచి చమురు కొనుగోళ్లను కొనసాగించగలదా అనే అంశంపై అంతర్జాతీయంగా కొత్త చర్చ మొదలైంది.
CNBC ఇంటర్నేషనల్ ప్రచురించిన వివరణాత్మక నివేదిక ప్రకారం.. ఈ కోర్టు తీర్పు భారతదేశ ఇంధన వ్యూహానికి అనుకూలంగా మారింది. అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం (IEEPA) కింద విస్తృత స్థాయిలో దిగుమతి సుంకాలు విధించే చట్టపరమైన అధికారం అధ్యక్షుడికి లేదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. దీంతో, రష్యా నుంచి చమురు దిగుమతుల ఆధారంగా భారత్పై అదనపు సుంకాలు విధించే అవకాశాలు పరిమితమయ్యాయి.

ఇంధన నిపుణుల అభిప్రాయం ప్రకారం.. భారతదేశం తన ఇంధన అవసరాలు, ధరల ప్రయోజనం, సరఫరా భద్రతను దృష్టిలో ఉంచుకుని రష్యన్ చమురు దిగుమతులను పూర్తిగా నిలిపివేయడం అసంభవం. క్విన్సీ ఇన్స్టిట్యూట్ గ్లోబల్ సౌత్ ప్రోగ్రామ్ డైరెక్టర్ సారంగ్ షిడోర్ మాట్లాడుతూ.. ఇంధన రంగంలో సహా రష్యాతో భారతదేశం మంచి సంబంధాలను కొనసాగిస్తుంది. అవసరమైతే దిగుమతులు కొంత తగ్గవచ్చు, కానీ పూర్తిగా ఆపడం జరిగే అవకాశాలు తక్కువని అన్నారు.
ఇంధన డేటా సంస్థ క్ప్లర్ గణాంకాల ప్రకారం.. ఫిబ్రవరిలో భారత్ రోజుకు సగటున 1.16 మిలియన్ బ్యారెళ్ల రష్యన్ చమురును దిగుమతి చేసుకుంది. ఇది 2025 సగటు రోజువారీ దిగుమతులైన 1.71 మిలియన్ బ్యారెళ్లతో పోలిస్తే తక్కువ. మార్చి, ఏప్రిల్ నెలల గణాంకాలు ఇంకా స్పష్టంగా లేనప్పటికీ.. US-భారత్ మధ్య తాత్కాలిక వాణిజ్య ఒప్పందం తర్వాత భారత శుద్ధి కర్మాగారాలు కొత్త రష్యన్ చమురు ఒప్పందాల విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అయితే, సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఈ ధోరణి మారుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.
నిపుణుల అంచనాల ప్రకారం.. భారత్ రష్యా నుంచి రోజుకు 8 లక్షల నుంచి 1 మిలియన్ బ్యారెళ్ల వరకు చమురు దిగుమతులను చేయగల స్థితిలో ఉంది. గతంలో రష్యన్ చమురు కొనుగోళ్లు భారత్-అమెరికా సంబంధాల్లో ఉద్రిక్తతలకు దారితీశాయి. గత సంవత్సరం ఆగస్టులో.. ట్రంప్ పరిపాలన భారత్పై అదనంగా 25 శాతం సుంకం విధించింది. దీంతో భారత ఎగుమతులపై మొత్తం సుంక భారం 50 శాతానికి చేరింది. అనంతరం, తాత్కాలిక వాణిజ్య ఒప్పందం కింద ఈ సుంకాన్ని 18 శాతానికి తగ్గించారు.
ఫిబ్రవరిలో జారీ చేసిన ఒక కార్యనిర్వాహక ఉత్తర్వులో.. ట్రంప్ శిక్షాత్మక సుంకాన్ని ఎత్తివేసి, భారత్ రష్యన్ చమురు దిగుమతులను తగ్గించేందుకు సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. అయితే, రెండు దేశాల ఉమ్మడి ప్రకటనలో అలాంటి స్పష్టమైన నిబద్ధత ఏదీ నమోదు కాలేదు. మరోవైపు, రాబోయే ఐదేళ్లలో అమెరికా నుంచి సుమారు 500 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులు, ఇంధన ఉత్పత్తులను కొనుగోలు చేయాలనే ఉద్దేశాన్ని భారత్ వ్యక్తం చేసింది.
ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్కు చెందిన ఆర్థికవేత్త అలెగ్జాండ్రా హెర్మాన్ అభిప్రాయం ప్రకారం.. భారతదేశ ఇంధన వ్యూహం ధరల ప్రయోజనం, సరఫరా వైవిధ్యంపై ఆధారపడి ఉంటుంది. ఒకే సరఫరాదారుపై ఆధారపడకుండా, రష్యా, అమెరికా తదితర దేశాల నుంచి సమతుల్యంగా చమురు కొనుగోలు చేయడమే భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. క్లుప్తంగా చెప్పాలంటే అమెరికా సుప్రీంకోర్టు తీర్పు భారతదేశానికి వ్యూహాత్మక ఊపిరి పోసినట్లైంది. రష్యన్ చమురు కొనుగోళ్లపై అమెరికా నుంచి తీవ్రమైన ఒత్తిడి తగ్గే అవకాశాలు పెరిగాయని నిపుణులు భావిస్తున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

Russian oil: ట్రంప్ క్లెయిమ్ VS రియాలిటీ.. రష్యా ఆయిల్ కొనుగోలుపై క్లారిటీ ఇచ్చిన న్యూఢిల్లీ!

భారత్ టైర్ పరిశ్రమను కుదిసేస్తున్న ఇరాన్ యుధ్ద ప్రభావం.. కీలకమైన హెచ్చరిక చేసిన CLSA

Iran war: ఇరాన్లో హై అలర్ట్: ఖమేనీ అంత్యక్రియలు వాయిదా.. ఏం జరుగుతోంది?

Iran war: ఇరాన్ సంచలన నిర్ణయం.. అణు బాంబు తయారీ ఆపేస్తాం! కానీ ఆ ఒక్క కండిషన్!

ఇరాన్ మీద దాడులు.. బట్ట బయలైన అమెరికా కుట్రలు.. ప్రపంచానికి నిజాన్ని తెలిపిన స్పెయిన్..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

ఇరాన్–అమెరికా యుద్ధంపై షాకింగ్ న్యూస్.. ఎవరి ఆయుధాలు ముందుగా అయిపోతాయో తెలుసా..

భారత ఆర్థిక వ్యవస్థని కుదిపేస్తున్న గల్ఫ్ యుద్ధ మంటలు.. ప్రమాదంలో 9 కోట్ల మంది పంపే డబ్బు ..

ఇరాన్పై యుద్ధంతో ఖాళీ అవుతున్న అమెరికా ఖజానా.. తొలి 24 గంటల్లోనే రూ. 7 వేల కోట్లకు పైగా ఖర్చు..

మిత్రుడిని అమెరికా చంపేస్తుంటే మౌనంగా చూస్తుండిపోయిన చైనా.. సైలెంట్ వెనక మిస్టరీ ఇదే..

నేస్తం నేనున్నా.. భారత్కు అండగా నిలిచిన రష్యా.. చమురు సంక్షోభంపై కీలక ప్రకటన..

ఎర్ర సముద్రంలో కల్లోలం..భారత ఎగుమతులపై భారీ ఎఫెక్ట్..తడిసిమోపెడవుతున్న ఛార్జీలు..

యురేనియం నుంచి వాణిజ్యం వరకు.. మోదీ–కార్నీ భేటీలో జరిగిన ఒప్పందాలు ఇవే..



Click it and Unblock the Notifications
