మారుతీ సుజుకీ బంపర్ ఆఫర్: ఏడాదికి 3 ఈఎంఐలు, హెచ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీ బ్యాంకుతో టై అప్...

లాక్‌డౌన్‌తో అన్నీరంగాలు కుదేలైపోయాయి. ఇక ఆటోతమొబైల్ రంగం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటీవల మహీంద్రా ఎస్‌యూవీ వాహనాలు కొనుగోలు చేస్తే.. వచ్చే ఏడాది అంటే 2021 నుంచి ఈఎంఐ కట్టాలని ప్రకటించిన సంగతి తెలిసిందే. అదేబాటలో మారుతి సుజుకీ కూడా పయనిస్తోంది. ఏడాదిలో మూడు అంటే.. మూడు ఈఎంఐలు మాత్రమే కట్టాలని కస్టమర్లను కోరుతోంది. ఇందుకోసం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుతో మారుతీ కంపెనీ టై అప్ అయ్యింది.

తమ వాహనాలు కొనుగోలు అయ్యేలా మారుతీ సుజుకీ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం హెచ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీతో టై అప్ అయ్యింది. వినియోగదారుడు మారుతీ సుజుకీ కారు కొనుగోలు చేస్తే ఏడాదికి 3 ఈఎంఐలు మాత్రమే చెల్లించే వెసులుబాటు కల్పించింది. దీంతోపాటు తీసుకున్న వాహనం ఖరీదుపై లక్ష రుణంపై రూ.899 చొప్పున ఈఎంఐగా చెల్లించాల్సి ఉంటుంది. చెల్లించే ఈఎంఈకి ఈ రుణం అదనం. లక్షకు రూ.899 ఈఎంఐ మొదటి ఆరునెలల వరకు హెచ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీ బ్యాంకు అందిస్తోంది. తర్వాత మాత్రం కస్టమర్లు చెల్లించాల్సి ఉంటుంది.

buy a maruti suzuki car..pay per annum 3 emis only..

మహీంద్రా కంపెనీ మాత్రం తీసుకున్న లోన్ ఎనిమిది ఏళ్లలో చెల్లించాలని షరతు విధించింది. మారుతీ సుజుకీ-హెచ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీ బ్యాంకు మాత్రం రుణం చెల్లించే అంశంపై కస్టమర్లకు నిర్దేశిత గడువు విధించలేదు. వినియోగదారుడు కారు కొనుగోలు చేసిన సమయంలోనే.. గడువు విధిస్తారు. దీంతో కంపెనీ, కొనుగోలుదారుడు మధ్య అప్పుడే అవగాహన జరుగుతుంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+