ముంబై: బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ఉధయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ఈ దశాబ్దానికి పార్లమెంటు తొలి సెషన్ ఈ రోజు ప్రారంభమైందని, దేశ అత్యుత్తమ భవిష్యత్తుకు ఈ దశాబ్దం ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. అనంతరం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేను ప్రవేశ పెడుతున్నారు. నిర్మలమ్మ ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ను ప్రవేశ పెడతారు.