బంగారంపై 'డబుల్' గుడ్‌న్యూస్: దిగుమతి సుంకం తగ్గింపు, భారీగా తగ్గిన పసిడి ధర

ఢిల్లీ: బంగారం కొనుగోలుదారులకు కేంద్ర ప్రభుత్వం 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో గుడ్‌న్యూస్ తెలిపింది. బంగారంపై దిగుమతి సుంకాన్ని 12.5 శాతం నుండి 7.5 శాతానికి తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీంతో బంగారం ధరలు స్వల్పంగా తగ్గనున్నాయి. ఓ వైపు నిర్మలమ్మ ప్రకటనకు తోడు, నేడు బంగారం ధరలు నేడు భారీగా పడిపోయాయి.

దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో 10 గ్రాముల పసిడి ధర ఏకంగా రూ.వెయ్యికి పైగా తగ్గింది. ఫిబ్రవరి ఫ్యూచర్ రూ.1,040.00 (-2.12%) తగ్గి రూ.48,056.00కి దిగి వచ్చింది. ఏప్రిల్ ఫ్యూచర్స్ రూ.1,076.00 (-2.18%) తగ్గి రూ.48,261.00కు పడిపోయింది. అయితే సిల్వర్ ఫ్యూచర్స్ మాత్రం పెరిగింది. వండి రూ.4వేలకు పైగా పెరిగింది.

 Budget 2021: Government cuts import tax on gold, silver to 7.5 percent from 12.5

బంగారం ధర అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం భారీగా పెరిగింది. కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 16.65 (+0.90%) డాలర్లు పెరిగి 1866.95 డాలర్ల వద్ద ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో వెండి 3.249 (+12.07%) డాలర్లు పెరిగి 3.249 (+12.07%) డాలర్ల వద్ద ఉంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+