న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.5 లక్షల కోట్ల మేర పన్ను ఆదాయానికి గండిపడే అవకాశాలు ఉన్నాయని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం తెలిపారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ను ప్రవేశపెట్టారు. కార్పోరేట్ ట్యాక్స్కు సంబంధించి రూ.2.34 లక్షల కోట్ల మేర గండిపడవచ్చునని అంచనా వేస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గ్రాస్ ట్యాక్స్ కలెక్షన్స్ రూ.24.2 లక్షల కోట్లుగా ఉంటుందని అంచనా వేశారు. అయితే ఇది రూ.5.2 లక్షల కోట్లు తగ్గి రూ.19 లక్షలుగా నమోదు కావొచ్చునని అంచనా వేస్తున్నారు.
అంతకుముందు ఆర్థిక సంవత్సరంలోని రూ.20 లక్షల కంటే కూడా ఇది తక్కువ. కార్పోరేట్ ట్యాక్స్ వసూళ్లు రూ.6.8 లక్షల కోట్లుగా ఉంటుందని అంచనా వేయగా, రూ.2.34 లక్షల కోట్ల మేర కోత పడుతుందని భావిస్తున్నారు. దీనిని రూ.4.46 లక్షల కోట్లకు సవరించారు. ఇన్కం ట్యాక్స్ వసూళ్లు రూ.6.38 లక్షల కోట్లుగా గత బడ్జెట్లో అంచనా వేయగా, రూ.1.8 లక్షలకోట్లు తగ్గుతుందని భావిస్తున్నారు. తాజా సవరణ ప్రకారం రూ.4.59 లక్షల కోట్లుగా ఉంటుందని భావిస్తున్నారు. ఇక జీఎస్టీ కలెక్షన్లు బడ్జెట్ టార్గెట్ రూ.6.9 లక్షల కోట్లు కాగా, రూ.5.15 కోట్లకు సవరించారు.

టెలికం ఇండస్ట్రీ నుండి 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను ఆదాయం 60 శాతం పెరుగుతుందని కేంద్రం భావిస్తోంది. రక్షణ రంగానికి 4.78 లక్షల కోట్లు కేటాయించారు.
కాగా, నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ పైన ప్రధాని మోడీ ప్రశంసలు కురిపించారు. దేశ ప్రజలకు మేలు చేసేలా ఈ బడ్జెట్ ఉందన్నారు. స్వయంసమృద్ధితో పాటు అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలు నెరవర్చేలా నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారన్నారు. ఆసాధారణ పరిస్థితుల నేపథ్యంలో 2021-22 బడ్జెట్ ప్రవేశపెట్టినట్లు తెలిపారు. కాగా, కేంద్ర బడ్జెట్ పైన రాహుల్ గాంధీ విమర్శల గుప్పించారు. మోనిటైజేషన్ ప్లాన్తో జాతికి చెందిన ఆస్తుల్ని అమ్మకానికి పెడుతున్నారని దుయ్యబట్టారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications