న్యూఢిల్లీ: తమ ప్రభుత్వం వైద్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్ తెలిపారు. శనివారం ఉదయం పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఆమె ప్రసంగించారు. వైద్య రంగానికి రూ. 69,000 కోట్లను కేటాయిస్తున్నట్లు తెలిపారు.
నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు నిర్మలా సీతారామన్. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకమని వివరించారు. పీపీపీ పద్ధతిలో ఆయుష్మాన్ భారత్ స్కీం కింద 112 జిల్లాలోని టైర్-II, టైర్III పట్టణాలు, నగరాల్లో ఆస్పత్రులను నెలకొల్పుతామని మంత్రి తెలిపారు.

దేశంలో ఆయుష్మాన్ భారత్ అమలు కాని జిల్లాల్లో ఈ ఆస్పత్రులు ఏర్పాటు చేసి ప్రజలకు వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి వివరించారు. ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కింద ఈ ఆస్పత్రులకు రూ. 6000 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు.
మెడికల్ డివైసెస్లపై విధించే పన్నుల ద్వారా వచ్చే మొత్తాన్ని ఆస్పిరేషనల్ జిల్లాల్లో మౌలికసదుపాయాల కోసం ఉపయోగిస్తామని మంత్రి తెలిపారు. 2025 వరకు టీబీని భారతదేశం నుంచి తరిమేస్తామని స్పష్టం చేశారు. టీబీ ఓడిపోతుంది.. ఇండియా గెలుస్తుందని ఈ సందర్భంగా ఆమె వ్యాఖ్యానించారు.
మంచి నీటి కోసం 'జల్ జీవన్ మిషన్' పథకాన్ని తీసుకొచ్చామని, ప్రాథమిక ఆరోగ్య సమస్యలను దూరం చేసేందుకు సానిటేషన్ ప్రోగ్రాం 'స్వచ్ఛ భారత్ యోజన' తీసుకొచ్చామని వివరించారు. స్వచ్ఛ భారత్ మిషన్ కోసం ఈ సంవత్సరం రూ. 12,300 కోట్లు కేటాయించినట్లు మంత్రి నిర్మలా సీతారామన్ వివరించారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications