budget 2020: ప్రవైటుకు వాటా: ఎల్ఐసీ, ఐడీబీఐపై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బీమా సంస్థ అయిన లైఫ్ ఇన్స్యురెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ ) వాటాల విక్రయానికి నిర్ణయించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. శనివారం పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఆమె ప్రసంగించారు. ఎల్ఐసీని స్టాక్ మార్కెట్లు లిస్టింగ్‌కు తీసుకురానున్నట్లు తెలిపారు.

త్వరలో ఎల్ఐసీ స్టాక్ మార్కెట్‌లో లిస్టింగ్ చేయనున్నామని పేర్కొన్నారు. ఎల్ఐసీలో తన హోల్డింగ్‌లో కొంత భాగాన్ని ప్రారంభ పబ్లిక్ ఆఫర్ ద్వారా విక్రియంచాలని ప్రభుత్వం ప్రతిపాదించిందని తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం ఎల్ఐసీలో 100 శాతం వాటాను కలిగివుంది. ఇందులో కొంత వాటా భాగాన్ని ప్రైవేటుకు అప్పగించనుంది.

మరిన్ని బడ్జెట్ కథనాలు

budget 2020: Gov to offload its shares in LIC, IDBI to private investors

కాగా, ఐడీబీఐ బ్యాంక్ వాటాలనూ విక్రయించనున్నట్లు మంత్రి తెలిపారు. బ్యాంకుల్లో ప్రైవేటు భాగస్వామ్యం పెరగాలని అని అన్నారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులకు మరిన్ని ప్రోత్సాహకాలు ఇస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వరంగ బ్యాంకులకు రూ. 3.5లక్షల కోట్లు మూలధన సాయం అందిస్తున్నట్లు చెప్పారు.

పార్లమెంటులో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్.. ఎల్ఐసీ, ఐడీబీఐ వాటాలను విక్రయిస్తామని ప్రకటించిన నేపథ్యంలో స్టాక్ మార్కెట్లలో ఈ రెండు సంస్థల షేర్లు లాభాల బాట పట్టాయి. ఐడీబీఐ బ్యాంక్ షేర్లు 16శాతం పెరుగుదల నమోదు చేసింది. అలాగే ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ 3శాతం పెరుగుదల చూపింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+