ఎన్ఎస్ఈలో సాంకేతిక సమస్య, ట్విట్టర్ ద్వారా స్పందించిన ఎక్స్చేంజీ

దేశీయ ప్రధాన స్టాక్ ఎక్స్చేంజీల్లో ఒకటైన ఎన్ఎస్ఈలో సోమవారం సాంకేతిక సమస్య తలెత్తింది. ట్రేడింగ్ ప్రారంభమైన కాసేపటికి కొన్ని స్టాక్స్ ధరలు తెరపై అప్ డేట్ కాలేదని పలు బ్రోకరేజీ సంస్థలు ఎక్స్చేంజీ దృష్టికి తీసుకు వచ్చాయి. నిఫ్టీ సహా మరిన్ని ఇండెక్స్ ధరలు కూడా తెరపై కనిపించలేదని పేర్కొన్నాయి. గత ఏడాది కూడా ఇలాంటి సమస్య తలెత్తింది. 2021 ఫిబ్రవరి 24వ తేదీన టెక్నికల్ ఇ,్యూ కారణంగా ఎక్స్చేంజీని నాలుగు గంటల పాటు క్లోజ్ చేశారు.

ఇప్పుడు మరోసారి సమస్య తలెత్తింది. ఎన్ఎస్ఈ వినియోగిస్తున్న సాంకేతికత, ఆటోమేషన్ పైన అనుమానాలు వస్తున్నాయి. కాగా, సమస్యను గుర్తించగానే పరిష్కరించినట్లు ఎన్ఎస్ఈ స్పష్టం చేసింది. నిఫ్టీ బ్యాంకింగ్ నిఫ్టీలో అప్పుడప్పుడు ధరలు తెరపై అప్ డేట్ కాలేదని తెలిపింది. దీనిని పరిష్కరించినట్లు వెల్లడించింది. అన్ని సూచీలు సాధారణంగా పని చేస్తున్నాయని పేర్కొంది.

 Brokerages report issue with NSE stocks data feed, Nifty 50 index updating normally now

సాంకేతిక సమస్య తలెత్తినప్పుడు ధరలు మాత్రమే అప్ డేట్ కాలేదని బ్రోకరేజీ సంస్థలు వెల్లడించాయి. అయితే ఆర్డర్లు మాత్రం ఎగ్జిక్యూట్ అయ్యాయని పేర్కొంది. డెరివేటివ్స్ విభాగం కూడా సాధారణంగా పని చేసినట్లు తెలిపారు. కో-లొకేషన్, ప్రాగ్జిమిటీ సర్వర్లు ఈ సమస్యను ఎదుర్కొన్నాయా లేదా కేవలం నాన్ కో-లొకేషన్ ట్రేడర్లు మాత్రమే ఇబ్బంది పడ్డారా విచారించాల్సి ఉంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+