గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా, దేశీయంగా ఆర్థిక మందగమనం నెలకొంది. ఇప్పుడు కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. మార్కెట్లు దెబ్బతిన్నాయి. ఉత్పత్తులు పడిపోయాయి. దీంతో వివిధ దేశాల్లో నిత్యావసర వస్తువులకు డిమాండ్ పెరుగుతోంది. భారత్లోను కరోనా ప్రభావం ఎక్కువే ఉంది. ముందు జాగ్రత్తగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నాయి. నిత్యావసరాలకు మాత్రం డిమాండ్ ఉంది.

నాడు భారీగా పడిపోయిన సేల్స్
2019 ఆగస్ట్ నెలలో పార్లే-జీ ఆర్థిక మందగమనం నేపథ్యంలో 10,000 మంది ఉద్యోగులను తొలగించే పరిస్థితులు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. అప్పుడు బిస్కట్ ఉత్పత్తులు భారీగా పడిపోయాయి. బ్రిటానియా కూడా ఉద్యోగులను తొలగిస్తుందని నాడు వార్తలు వచ్చాయి. మందగమనం సమయంలో బిస్కట్ సేల్స్ భారీగా పడిపోయాయి.

ఇప్పుడు రివర్స్.. పెరిగిన బిస్కట్ సేల్స్
ఇప్పుడు పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఇప్పుడు బిస్కట్ సేల్స్ భారీగా పెరిగాయి. రెండు వారాల క్రితం పార్లే-జీ బిస్కట్ సేల్స్ 10 శాతం నుండి 15 శాతం పెరిగాయట. గత వారం ఏకంగా 25 శాతం పెరిగాయట. అంటే మార్చి నెలలోనే బిస్కట్ సేల్స్ పెరుగుతున్నాయి.

25 శాతం వరకు పెరుగుదల
ఇండియాలో అత్యంత పాపులర్ బ్రాండ్లలో పార్లేజీ ఒకటి. డిస్ట్రిబ్యూటర్స్, స్టోర్స్, ఈ కామర్స్ ఛానల్స్ వద్ద పెద్ద ఎత్తున స్టాక్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు బిస్కట్ ర్యాక్లు ఖాళీ అవుతున్నాయట. ఎందుకంటే గతంలో కంటే సేల్స్ ఏకంగా 25 శాతం పెరగడమే ఇందుకు కారణం.

బిస్కట్లకు టైమ్ వచ్చింది..!
ఆర్థిక మందగమనం నేపథ్యంలో గత క్యాలెండర్ ఏడాదిలో సేల్స్ భారీగా తగ్గాయని, వినియోగదారులు కనీసం రూ.5 బిస్కట్ కూడా కొనుగోలు చేయలేని పరిస్థితులు అని ఆందోళన వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు బిస్కట్ ర్యాక్లు ఖాళీ అవుతున్నాయట. ఇప్పుడు బిస్కట్లకు టైమ్ వచ్చింది అని చమత్కరిస్తున్నారు.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్లో అసలేం జరుగుతోంది..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications