రండి, UKలో మీ ఇండియన్ కంపెనీలను పెట్టండి… మేము మిమ్మల్ని రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానిస్తున్నాం.

బ్రిటన్ ప్రధాని "కియర్ స్టార్మర్" గురువారం భారత ఫిన్‌టెక్ మరియు టెక్ కంపెనీలను బ్రిటన్‌లో వ్యాపారం చేయమని ఆహ్వానిస్తూ, భారత కంపెనీలకు మేము ఎర్ర తివాచీ పరుస్తున్నాం అని ప్రకటించారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం, వేగంగా అభివృద్ధి చెందుతున్న అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన భారతదేశంతో బలమైన భాగస్వామ్యం కోసం మేము కట్టుబడి ఉన్నాం," అని ఆయన పేర్కొన్నారు.

ముంబైలోని జియో కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్టివల్లో ఆయన మాట్లాడారు. ప్రధాని అయిన తర్వాత ఆయన తీసుకువచ్చిన ఇది మొదటి వ్యాపార బృందం. గత 10 ఏళ్లలోనే కాకుండా, భారత్‌కి వచ్చిన ఇది ఇప్పటివరకు అతిపెద్ద బ్రిటన్ వ్యాపార బృందం. స్టార్మర్ తన ప్రసంగాన్ని హిందీలో ప్రారంభించి, "ముఝే యహాన్ ఆకర్ బహుత్ ఖుషీ హుయీ (ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది) అని అన్నారు.

Big Opportunities in the UK for Indian Fintech and Tech Firms

"మీరు గొప్ప ఉద్యోగాలు, అభివృద్ధి, విజయాలు సాధించాలనుకుంటే, మేము ఎర్రతివాచీ పరుస్తున్నాం. యుకేలో భారత ప్రముఖ సంస్థలు విస్తరించి, ప్రపంచ మార్కెట్‌లో అడుగుపెట్టాలి. అదే సమయంలో బ్రిటన్ కంపెనీలు భారత్‌లో విజయవంతం కావాలి," అని ఆయన స్పష్టం చేశారు. "ప్రధాని మోడీతో కలిసి మేము నిర్మిస్తున్న సంబంధం ఆధునికమైనదిగా, డైనమిక్‌గా ఉంటుంది. ఇది గొప్ప లక్ష్యాలతో కూడిన భాగస్వామ్యం. మేము కలిసి గొప్ప విషయాలు సాధించగలమని తెలుసు," అని స్టార్మర్ అన్నారు. అలాగే, "ఈ సంబంధంలో పెట్టుబడి పెట్టే సమయం వచ్చేసింది. ఇది యుకే-ఇండియా భాగస్వామ్యంలో కొత్త యుగానికి నాంది అవుతుంది. ఎన్నో సంవత్సరాలు సామాన్య ప్రజల జీవితాలను మెరుగుపరుస్తుంది," అని పేర్కొన్నారు.

స్టార్మర్ మాట్లాడుతూ, "ఫిన్‌టెక్ మరియు ఇన్నోవేషన్ కోసం యుకేను మరింత ఆకర్షణీయంగా మార్చుతున్నాం. డిజిటల్ మౌలిక సదుపాయాలు, డేటా షేరింగ్, AI వినియోగంపై పెట్టుబడి పెడుతున్నాం. అంతేకాదు, ఫాస్ట్-ట్రాక్ అనుమతులు, సులభతర కాంప్లయన్స్, సడలింపులతో అత్యుత్తమ గ్లోబల్ టాలెంట్‌ను ఆకర్షిస్తున్నాం. అంతర్జాతీయ సంస్థల కోసం ప్రత్యేకంగా "ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీస్ని ఏర్పాటు చేస్తున్నాం. యుకే నిజంగానే ఈ అవకాశాలకు కట్టుబడి ఉందని చూపించడానికి మేము భారత్‌కి వచ్చాము" అన్నారు.

ఇందుకు ముందు మోడీ, స్టార్మర్ ఇద్దరూ CEO ఫోరంలో పాల్గొని పరిశ్రమ నాయకులతో చర్చించారు. గత మూడు నెలల్లో యుకే-ఇండియా మధ్య వాణిజ్య, పెట్టుబడులు "6 బిలియన్ పౌండ్లు" పెరిగాయి అని స్టార్మర్ తెలిపారు. అలాగే, "గత బ్రిటన్ ప్రభుత్వాలు ఒప్పందాలు కుదుర్చుకొని, తర్వాత దానిపై ఫాలో-అప్ చేయకుండా వదిలేవి. కానీ ఇప్పుడు మేము భిన్నంగా పని చేస్తాం. ప్రభుత్వమే సహకారం, మద్దతు అందిస్తూ ఈ ఒప్పందం వాస్తవ ప్రయోజనం ఇస్తుందని చూసుకుంటుంది" అని స్పష్టం చేశారు.

ప్రెస్ బ్రీఫింగ్‌లో స్టార్మర్ "ఇజ్రాయెల్-గాజా శాంతి ప్రణాళికకు" స్వాగతం పలికారు. "ఇది బందీలకు, వారి కుటుంబాలకు, గాజాలోని ప్రజలకు ఊరట కలిగిస్తుంది," అన్నారు. ఈ ఒప్పందం ప్రెసిడెంట్ ట్రంప్ నేతృత్వం వల్లే సాధ్యమైందని కూడా ఆయన గుర్తు చేశారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం పై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ, "భారతదేశం రష్యా చమురు కొనుగోలు ఆపాలని మేము చర్చించాము. ఈ యుద్ధం ముగియాలని మేము కోరుకుంటున్నాము. ఇందుకోసం శాడో ఫ్లీట్, కోలీషన్ ఆఫ్ ది విల్లింగ్ వంటి అంశాల పై చర్చించాము" అని స్టార్మర్ తెలిపారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+