బ్రిటన్ ప్రధాని "కియర్ స్టార్మర్" గురువారం భారత ఫిన్టెక్ మరియు టెక్ కంపెనీలను బ్రిటన్లో వ్యాపారం చేయమని ఆహ్వానిస్తూ, భారత కంపెనీలకు మేము ఎర్ర తివాచీ పరుస్తున్నాం అని ప్రకటించారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం, వేగంగా అభివృద్ధి చెందుతున్న అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన భారతదేశంతో బలమైన భాగస్వామ్యం కోసం మేము కట్టుబడి ఉన్నాం," అని ఆయన పేర్కొన్నారు.
ముంబైలోని జియో కన్వెన్షన్ సెంటర్లో జరిగిన గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్టివల్లో ఆయన మాట్లాడారు. ప్రధాని అయిన తర్వాత ఆయన తీసుకువచ్చిన ఇది మొదటి వ్యాపార బృందం. గత 10 ఏళ్లలోనే కాకుండా, భారత్కి వచ్చిన ఇది ఇప్పటివరకు అతిపెద్ద బ్రిటన్ వ్యాపార బృందం. స్టార్మర్ తన ప్రసంగాన్ని హిందీలో ప్రారంభించి, "ముఝే యహాన్ ఆకర్ బహుత్ ఖుషీ హుయీ (ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది) అని అన్నారు.

"మీరు గొప్ప ఉద్యోగాలు, అభివృద్ధి, విజయాలు సాధించాలనుకుంటే, మేము ఎర్రతివాచీ పరుస్తున్నాం. యుకేలో భారత ప్రముఖ సంస్థలు విస్తరించి, ప్రపంచ మార్కెట్లో అడుగుపెట్టాలి. అదే సమయంలో బ్రిటన్ కంపెనీలు భారత్లో విజయవంతం కావాలి," అని ఆయన స్పష్టం చేశారు. "ప్రధాని మోడీతో కలిసి మేము నిర్మిస్తున్న సంబంధం ఆధునికమైనదిగా, డైనమిక్గా ఉంటుంది. ఇది గొప్ప లక్ష్యాలతో కూడిన భాగస్వామ్యం. మేము కలిసి గొప్ప విషయాలు సాధించగలమని తెలుసు," అని స్టార్మర్ అన్నారు. అలాగే, "ఈ సంబంధంలో పెట్టుబడి పెట్టే సమయం వచ్చేసింది. ఇది యుకే-ఇండియా భాగస్వామ్యంలో కొత్త యుగానికి నాంది అవుతుంది. ఎన్నో సంవత్సరాలు సామాన్య ప్రజల జీవితాలను మెరుగుపరుస్తుంది," అని పేర్కొన్నారు.
స్టార్మర్ మాట్లాడుతూ, "ఫిన్టెక్ మరియు ఇన్నోవేషన్ కోసం యుకేను మరింత ఆకర్షణీయంగా మార్చుతున్నాం. డిజిటల్ మౌలిక సదుపాయాలు, డేటా షేరింగ్, AI వినియోగంపై పెట్టుబడి పెడుతున్నాం. అంతేకాదు, ఫాస్ట్-ట్రాక్ అనుమతులు, సులభతర కాంప్లయన్స్, సడలింపులతో అత్యుత్తమ గ్లోబల్ టాలెంట్ను ఆకర్షిస్తున్నాం. అంతర్జాతీయ సంస్థల కోసం ప్రత్యేకంగా "ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీస్ని ఏర్పాటు చేస్తున్నాం. యుకే నిజంగానే ఈ అవకాశాలకు కట్టుబడి ఉందని చూపించడానికి మేము భారత్కి వచ్చాము" అన్నారు.
ఇందుకు ముందు మోడీ, స్టార్మర్ ఇద్దరూ CEO ఫోరంలో పాల్గొని పరిశ్రమ నాయకులతో చర్చించారు. గత మూడు నెలల్లో యుకే-ఇండియా మధ్య వాణిజ్య, పెట్టుబడులు "6 బిలియన్ పౌండ్లు" పెరిగాయి అని స్టార్మర్ తెలిపారు. అలాగే, "గత బ్రిటన్ ప్రభుత్వాలు ఒప్పందాలు కుదుర్చుకొని, తర్వాత దానిపై ఫాలో-అప్ చేయకుండా వదిలేవి. కానీ ఇప్పుడు మేము భిన్నంగా పని చేస్తాం. ప్రభుత్వమే సహకారం, మద్దతు అందిస్తూ ఈ ఒప్పందం వాస్తవ ప్రయోజనం ఇస్తుందని చూసుకుంటుంది" అని స్పష్టం చేశారు.
ప్రెస్ బ్రీఫింగ్లో స్టార్మర్ "ఇజ్రాయెల్-గాజా శాంతి ప్రణాళికకు" స్వాగతం పలికారు. "ఇది బందీలకు, వారి కుటుంబాలకు, గాజాలోని ప్రజలకు ఊరట కలిగిస్తుంది," అన్నారు. ఈ ఒప్పందం ప్రెసిడెంట్ ట్రంప్ నేతృత్వం వల్లే సాధ్యమైందని కూడా ఆయన గుర్తు చేశారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం పై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ, "భారతదేశం రష్యా చమురు కొనుగోలు ఆపాలని మేము చర్చించాము. ఈ యుద్ధం ముగియాలని మేము కోరుకుంటున్నాము. ఇందుకోసం శాడో ఫ్లీట్, కోలీషన్ ఆఫ్ ది విల్లింగ్ వంటి అంశాల పై చర్చించాము" అని స్టార్మర్ తెలిపారు.
More From GoodReturns

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంపై తొలిసారిగా స్పందించిన ప్రధాని మోదీ.. భారత్కు తీవ్ర ఆందోళన కలిగించే అంశమంటూ..

ఎర్ర సముద్రంలో కల్లోలం..భారత ఎగుమతులపై భారీ ఎఫెక్ట్..తడిసిమోపెడవుతున్న ఛార్జీలు..

Pak Drone: మూడు రోజుల్లో రెండోసారి.. జమ్మూ కాశ్మీర్లో పాక్ డ్రోన్ కలకలం! అసలేం జరుగుతోంది?

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారంతో సరికొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. గురి చూసిన కొట్టిన దెబ్బకి ప్రపంచ దేశాలు విలవిల..

బంగారం ధరల పెరుగుదలపై దిమ్మతిరిగే న్యూస్.. గత చరిత్రతో కీలక నివేదికను విడుదల చేసిన Kedia Advisory

హైదరాబాద్లో పాడ్ ట్యాక్సీలు వచ్చేస్తున్నాయ్.. మెట్రో స్టేషన్ నుంచి నేరుగా ఆఫీసుకే వెళ్లిపోవచ్చు ఇక..

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

Bengaluru: టీసీఎస్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్! మీ స్నేహితుడిని చేర్పించండి.. రూ. 40,000 గెలుచుకోండి!

హైదరాబాద్, పుణే వద్దు బెంగళూరు ముద్దు.. అధిక అద్దెలున్నా బెంగళూరును వదలమంటున్న టెక్ కంపెనీలు..

బంగారం ధరలు తగ్గాయి ..ఎంత తగ్గాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు.. ఫిబ్రవరి 26, గురువారం పసిడి ధరలు ఇవే..



Click it and Unblock the Notifications