కరోనా మహమ్మారి - లాక్ డౌన్ నేపథ్యంలో ఇటీవలి కాలంలో ఇండ్లు, ఫ్లాట్స్ బుక్ చేసుకొని ప్రారంభంలో ఉన్న వారికి కొత్త చిక్కు వచ్చి పడింది! ప్రస్తుత పరిస్థితుల్లో చాలామందికి వేతనాల్లో కోత విధిస్తున్నాయి కంపెనీలు. ఇంకొంతమంది ఉద్యోగాలు పోతున్నాయి. దీంతో గత రెండు మూడు నెలలుగా తమ తమ ప్రాజెక్టులలో ఫ్లాట్స్ బుక్ చేసుకున్న వారు కొత్త సవాళ్లు ఎదుర్కోవచ్చు.

మీ శాలరీ స్లిప్స్ మళ్లీ సబ్మిట్ చేయాల్సి రావొచ్చు
ఫ్లాట్స్ కోసం లోన్ తీసుకుంటే పలు డాక్యుమెంట్లు సమర్పించాలి. లోన్ మంజూరు చేసే బ్యాంకుకు శాలరీ స్లిప్ కూడా తప్పనిసరిగా ఇవ్వాలి. చాలా కంపెనీలు వేతన సవరణ లేదా ఉద్యోగాల కోత చేపట్టిన నేపథ్యంలో గత రెండు నెలల్లో బ్యాంకుల నుండి ఫ్లాట్స్ వంటి వాటి కోసం రుణాలు తీసుకున్న వారు తమ శాలరీ స్లిప్స్ మళ్లీ సబ్మిట్ చేయవల్సి ఉంటుంది. మీ చేతికి ఇచ్చే ముందే మీ పే స్లిప్ ఇవ్వాల్సి రావొచ్చు. ఎందుకంటే వారు ఇదివరకటి ఈఎంఐలు చెల్లించగలుగుతారా, ఆ సామర్థ్యం ఉందా తెలుసుకుంటారు.

రుణాల నిలిపివేత
బ్యాంకులు తమ రుణాలను నిలుపుదల చేస్తున్నట్లు పలువురు క్లయింట్స్ గత రెండు నెలలుగా తమ వద్దకు వచ్చినట్లు చెప్పినట్లు ముంబైకి చెందిన ఓ బిల్డర్ తెలిపాడు. ఓ ఫ్లాట్ కోసం ఇప్పటికే 20 శాతం రుణాలు మంజూరు చేసిన బ్యాంకులు కూడా మరో విడత రుణాన్ని లాక్ డౌన్ వంటి వివిధ కారణాల వల్ల నిలుపుదల చేసినట్లు చెబుతున్నారు. హ్యాండోవర్ చేసే ముందు రుణగ్రహీతలు తాము నెల ఈఎంఐ చెల్లించలేమని భావిస్తే ఈ ట్రాన్సాక్షన్ నుండి నిష్క్రమించవచ్చునని, అలాగే పూర్తిగా మీ చేతికి రాకముందే డిఫాల్ట్ అయితే తదుపరి ఇబ్బందులు తలెత్తవచ్చు.

రీ-అసెస్మెంట్
శాలరీ కరెక్షన్స్ నేపథ్యంలో బ్యాంకులు తమ క్లయింట్స్ హోమ్ లోన్స్ను రీవ్యాలిడేట్ చేస్తున్నాయి. ఇబ్బందికరంగా కనిపిస్తే తదుపరి రుణ పంపిణీ నిలిపివేస్తున్నాయి. హోమ్ లోన్స్కు సంబంధించి బ్యాంకుల నుండి తాము (క్లయింట్స్) క్రమంగా తప్పకుండా రుణాలు పొందుతున్నామని, లాక్ డౌన్ నేపథ్యంలో వీటిని నిలిపివేసినట్లు ముంబైకి చెందిన ఓ బిల్డర్ తెలిపాడు. ఇప్పటికే రెండుమూడుసార్లు మంజూరు చేసినప్పటికీ, రూ.50 లక్షల కంటే పైన హోమ్ లోన్ తీసుకున్న వారికి రీ-అసెస్మెంట్ ఉందంటున్నారు.

కొత్తదేమీ కాదు...
కొత్త పేస్లిప్ లేదా కొత్త ఇన్కం స్టేట్మెంట్ చూడటం కొత్తదేమీ కాదని, తమ సాధారణ మదింపు ప్రక్రియలో భాగంగానే కొత్త శాలరీ స్లిప్స్ అడుగుతున్నట్లు కొన్ని బ్యాంకులు చెబుతున్నాయి. పలు బ్యాంకులు పే స్లిప్స్ లేదా ఆర్థిక సంబంధ వివరాలు మళ్లీ సబ్మిట్ చేయాలని చెబుతున్నాయి. లాక్ డౌన్కు ముందు సాంక్షన్ అయిన లేదా అండర్ కన్స్ట్రక్షన్ వంటి వాటికి వీటిని అడుగుతున్నాయి.

ఈఎంఐ మారటోరియం ఉంటే.
అంతేకాదు, మారటోరియం ఉపయోగించుకునే వారికి ప్రాసెస్లో ఉంటే.. మనీ మంజూరు చేయడం బ్యాంకులు నిలుపుదల చేస్తున్నాయట. అయితే మారటోరియం గడువు ముగిసిన తర్వాత వీటి గురించి ఆలోచిస్తామని చెబుతున్నాయి కొన్ని బ్యాంకులు.ఆర్బీఐ డేటా ప్రకారం బ్యాంకుల హోమ్ లోన్ బుక్ మార్చి 27 నుండి ఏప్రిల్ 24 మధ్య భారీగా పడిపోయింది.
More From GoodReturns

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..



Click it and Unblock the Notifications