ప్రముఖ ఆన్ లైన్ షాపింగ్ దిగ్గజం అమెజాన్ పై కఠిన చర్యలు తీసుకోండి అంటూ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా ట్రేడర్స్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. నిబంధనలు పాటించని అమెజాన్ పై అంత తక్కువ జరిమానా ఎలా విధిస్తారు అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ ప్రభుత్వం విధించిన రూల్ ఉల్లంఘించినప్పటికీ కఠిన చర్యలు తీసుకోరా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

నిబంధనలు ఉల్లంఘించిన అమెజాన్ ... చర్యలు తీసుకోవాలని డిమాండ్
ఇ-కామర్స్ సంస్థలు ఫ్లిప్కార్ట్ మరియు అమెజాన్లకు తమ ప్లాట్ఫామ్లలో విక్రయించే ఉత్పత్తుల గురించి అవి ఏ దేశంలో తయారయ్యాయి వంటి అన్ని డీటైల్స్ ను కస్టమర్లకు తప్పనిసరిగా ఇవ్వటం లేదని ప్రభుత్వం నోటీసులు జారీ చేసినా , అందుకు సమాధానం ఇవ్వని , నిబంధనలు పాటించని క్రమంలో అమెజాన్ పై చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేసింది కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సిఏఐటి) .

25 వేల రూపాయల జరిమానా వేసిన సర్కార్ పై మండిపడిన సిఏఐటి
అమెజాన్ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఆన్లైన్ షాపింగ్ దిగ్గజానికి కేంద్ర సర్కార్ 25 వేల రూపాయల ఫైన్ విధించింది. వేల కోట్ల వ్యాపారం చేస్తున్న అమెజాన్ కు అంత తక్కువ జరిమానా విధించడాన్ని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా ట్రేడర్స్ తీవ్రంగా తప్పు పట్టింది. ఈ కామర్స్ దిగ్గజ సంస్థకు రూ. 25000 ఒక లెక్కనా అంటూ మండిపడింది. నిబంధనలు ఉల్లంఘించిన అమెజాన్ సంస్థపై ఇంకోసారి తప్పు చేయకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది . కనీసం వారం రోజుల పాటు అమెజాన్ పై నిషేధం విధించాలని కేంద్ర సర్కార్ ని కోరింది కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా ట్రేడర్స్.

నష్టానికి సమానంగా జరిమానా విధించాలని డిమాండ్ .. వారం పాటు బ్యాన్ చెయ్యండి
అమెజాన్ వల్ల మన దేశ ఆర్థిక వ్యవస్థ కలిగిన నష్టానికి సమానంగా జరిమానా విధించాలని, వస్తువుల తయారీ వివరాలను ప్రభుత్వానికి, కస్టమర్లకు అందించకుండా తప్పు చేసిన ఈ కామర్స్ సంస్థపై ప్రస్తుతం ఏడు రోజుల బ్యాన్ విధించాలని, మరోమారు తప్పు చేస్తే 15 రోజుల బ్యాంక్ విధించాలని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ జాతీయ అధ్యక్షుడు బిసి భార్టియా, సెక్రెటరీ జనరల్ ప్రవీణ్ ఖండే వాలా ఒక ప్రకటనలో తెలియజేశారు.

ఫెస్టివల్ సీజన్ సమయంలోనూ కేంద్రానికి లేఖ రాసిన సిఏఐటి
గతంలో పండుగ సీజన్ కు ముందు ఫెస్టివల్ సీజన్ అమ్మకాలను నిషేధించాలని జిఎస్టి మరియు ఆదాయపు పన్ను ఎగవేసే అవకాశం ఉన్న నేపథ్యంలో అమెజాన్ ఫ్లిప్ కార్ట్ లో అమ్మకాలను పర్యవేక్షించడానికి స్పెషల్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయాలని ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ కు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ లేఖ రాసిన విషయం తెలిసిందే. ఆన్లైన్ షాపింగ్ దిగ్గజాల కారణంగా, దేశీయులు వ్యాపారం చేయలేకపోతున్న కారణంగా మొదటి నుండి అమెజాన్ , ఫ్లిప్ కార్ట్ వంటి సంస్థలపై నిప్పులు చెరుగుతూనే ఉంది సిఏఐటి.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications