తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. ప్రస్తుతం వర్షకాలానికి సంబంధించి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు కింద ఎకరానికి రూ.10 వేలు రెండు దఫాలుగా అందిస్తోంది. వర్షకాల సీజన్, రబీ సీజన్ కు రైతులు ఖాతాల్లో ఎకరాకు రూ.5 వేలు జమ చేస్తోంది. వర్షకాలానికి సంబంధించి జూన్ 26 తేదీ నుంచి అన్నదాతల ఖాతాల్లో డబ్బులు వెస్తోంది.
సోమవారం ఎకరంలోపు ఉన్న రైతుల ఖాతాల్లో, మంగళవారం రెండోరోజు రెండెకరాలోపు ఉన్న రైతుల ఖాతాల్లో బుధవారం మూడెకరాలలోపు ఉన్న రైతుల ఖాతాల్లో, శుక్రవారం నాలుగెకరాలు ఉన్న రైతుల ఖాతాల్లో పంట పెట్టుబడి డబ్బులను జమ చేసింది. రైతు బంధు కింద డబ్బు జమ కొనసాగుతోందని వ్యవసాయ అధికారులు తెలిపారు. శనివారం ఐదెకరాలలోపు ఆ తర్వాత ఆరు, ఏడు ఎంత ఉంటే అంత భూమికి రైతు బంధు జమ చేయనున్నారు.

పోడు భూములకు కూడా రైతు బంధు ఇస్తున్నారు. శుక్రవారం రోజు సీఎం కేసీఆర్, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పోడు రైతులకు రైతు బంధు చెక్కులు పంపిణీ చేశారు. అయితే రైతు బంధు కౌలు రైతులకు కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కౌలు రైతులు నష్టపోతున్నారని వాదిస్తున్నారు. రైతు బంధు లాగే దేశంలో పీఎం కిసాన్ యోజన పథకం ద్వారా రైతులు ఆర్థిక సాయం చేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన పథకం కింది రైతులకు సంవత్సరానికి రూ.6 వేలు అందజేస్తోంది. నాలుగు నెలలకు ఒకసారి రూ.2 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఈ పీఎం కిసాన్ యోజన పథకాన్ని 2018లో ప్రారంభించారు. ఇప్పటి వరకు 13 విడతలుగా రైతులకు డబ్బు పంపిణీ చేశారు. త్వరలో 14 వ విడత పైసలు అన్నదాతల ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉంది. అయితే దీనికి రైతు తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలి.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications