విజయం ఎప్పుటికీ సింపుల్ గా రాదు. విజయం కోసం ఇష్టంగా కష్టపడాలి. ఇలా కష్టాల నుంచి విజయాల వైపు ప్రయాణించాడు అంకుష్ సచ్దేవా. ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) కాన్పూర్ నుంచి పట్టభద్రుడయ్యాక మైక్రోసాఫ్ట్ వంటి ప్రఖ్యాత కంపెనీలో ఇంటర్న్గా తన వృత్తిని ప్రారంభించాడు. అయినప్పటికీ కార్పొరేట్ ప్రపంచం అతని అభిరుచిని మరిపించలేకపోయింది.
అతని అభిరుచి వ్యవస్థాపకత మార్గంలో నడిచేలా చేసింది. సచ్దేవా తన కెరీర్ ప్రారంభ దశలో వైఫల్యాల వల్ల నిరాశ చెందలేదు. సచ్దేవా 17 విభిన్న స్టార్టప్ ఆలోచనలను ప్రయత్నించాడు. కానీ ప్రతి ఒక్క దాంట్లో నిరాశను ఎదుర్కొన్నాడు. అయితే, అతను ఓటమిని అంగీకరించడానికి నిరాకరించాడు. అతని 18వ ప్రయత్నంలో ఇద్దరు సహచరులతో కలిసి అతను అసాధారణమైనదాన్ని సాధించాడు.

ఇప్పుడు బిలియన్ల డాలర్ల విలువైన కంపెనీకి వ్యవస్థాపకుడిగా ఉన్నాడు. సచ్దేవా తాజా వెంచర్, షేర్చాట్ అతని 18వ ప్రత్యేకమైన ఆలోచన నుంచి ఉద్భవించింది. ఇక్కడ అతను తన IIT సహచరులు, ఫరీద్ అహ్సన్, భాను ప్రతాప్ సింగ్లతో కలిసి ఫేస్ బుక్, వాట్సాప్ కంటే కొత్త అనుభవాలను కోరుకునే వినియోగదారులకు అందించడానికి ఒక సోషల్ మీడియా యాప్ను రూపొందించారు.
మాతృ సంస్థ మొహల్లా టెక్ ప్రైవేట్ లిమిటెడ్ క్రింద జనవరి 2015లో స్థాపించబడిన షేర్చాట్ అక్టోబర్ 2015లో ప్రారంభిమైంది. మొదట హిందీ, మరాఠీ, మలయాళం, తెలుగు భాషలలో ప్రారంభించారు. ఈ కంపెనీ ప్రధాన కార్యాలయం బెంగుళూరులో ఉంది. షేర్ చాట్ ప్రపంచవ్యాప్తంగా తన పరిధిని వేగంగా విస్తరించింది. US, యూరోప్, అనేక ఇతర దేశాలలో గణనీయమైన వినియోగదారులను పెంచుకుంది. జూన్ 2022లో షేర్చాట్ గణనీయమైన నిధులను సాధించింది. రూ. 50,000 కోట్లకు పైగా నిధులు సేకరించింది.
More From GoodReturns

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..



Click it and Unblock the Notifications