లుంబినీ ప్రావిన్స్లోని తిలోత్తమ మునిసిపాలిటీ-1కి చెందిన అంజు థాపాకు 11 ఏళ్ల వయసులో మొదటి పీరియడ్ వచ్చింది. స్థానిక సంప్రదాయం ప్రకారం ఆమె తొమ్మిది రోజుల పాటు గోశాలలో విడిగా నివసించవలసి వచ్చింది. రక్తస్రావం అడ్డుకోవడానికి గుడ్డలను ఉపయోగించారు. మురికి గుడ్డ ముక్కలను పదే పదే ఉపయోగించడం వల్ల ఆమెకు ఇన్ఫెక్షన్ సోకింది.
అప్పుడే అంజు థాపాకు ప్యాడ్స్ తయారు చేయాలని ఆలోచన వచ్చింది. చిన్నతనంలో ఏం చేయలేకపోయింది. కానీ పెళ్లైన తర్వాత భర్త సాయంతో అనుకున్నది చేసి పారిశ్రామికవేత్తగా మారింది. " పెళ్లైన తర్వాత నేను స్థానిక మార్కెట్లో లభించే అన్ని రకాల శానిటరీ ప్యాడ్లను ప్రయత్నించాను. కానీ అవి సరిగా లేవు" అని థాపా పేర్కొన్నారు. సౌదీ అరేబియాలో ఉద్యోగం చేస్తున్న భర్త ప్రకాష్తో థాపా తన సమస్యను పంచుకుంది. అతను ఆమెకు అక్కడ నుంటు పునర్వినియోగపరచదగిన శానిటరీ ప్యాడ్లవప పంపించాడు.

అవి స్థానిక మార్కెట్లో లభించే వాటి కంటే మెరుగ్గా ఉన్నాయని అంజు థాపా చెప్పారు. ఎటువంటి అలెర్జీ రాలేదన్నారు.
థాపా గర్భం దాల్చడంతో బ్యాంకు ఉద్యోగాన్ని వదులుకోవాల్సి వచ్చింది. దీంతో ఇంట్లో ఉంటూ తను అనుకున్న వ్యాపారాన్ని ప్రారంభించాడనికి కసరత్తు మొదలు పెట్టింది. ట్యుటోరియల్స్ విని ప్యాడ్లను తయారు చేయడం నేర్చుకుంది. మొదట్లో స్థానికంగా లభించే మెటీరియల్స్ తో ప్యాడ్స్ తయారు చేసింది.
ఆమె రెండు సంవత్సరాల ప్రయత్నంలో ప్యాడ్స్ తయారీలో నైపుణ్యం సాధించింది. 2019లో ఆమె శానిటరీ ప్యాడ్లను తయారు చేయడానికి తన సొంత ఫ్యాక్టరీని ఏర్పాటు చేసింది. ఆమె రూ.2.5 మిలియన్లు వెచ్చించి ఏడు యంత్రాలను కొనుగోలు చేసింది. చైనా, బంగ్లాదేశ్ నుంచి ముడి పదార్థాలను కొనుగోలు చేసింది. థాపా తన ఫ్యాక్టరీలో నలుగురు మహిళలు పనిచేస్తున్నారు. ఆమె భర్త ప్రకాష్ తన వ్యాపారాన్ని విస్తరించడంలో సహాయం చేయడానికి సౌదీ అరేబియా నుంచి తిరిగి వచ్చాడు.
ప్రకాష్ ఉత్పత్తిని విక్రయించడానికి డిజిటల్ మార్కెటింగ్, సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నాడు. పునర్వినియోగ ప్యాడ్స్ కు డిమాండ్ క్రమంగా పెరుగుతోందన్నాడు. యూజ్ అండ్ త్రో శానిటరీ ప్యాడ్ల వల్ల కలిగే కాలుష్యంపై అవగాహన పెరగడం కూడా పునర్వినియోగ ఉత్పత్తులకు డిమాండ్ పెరగడానికి కారణమని భార్యాభర్తల చెబుతున్నారు.
థాపా ఉత్పత్తులు ఇప్పుడు దేశవ్యాప్తంగా అమ్ముడవుతున్నాయి. వివిధ స్థానిక సంస్థలు, ఆరోగ్య సంస్థలు, మహిళా సంఘాల అభ్యర్థన మేరకు పునర్వినియోగ ప్యాడ్లను తయారు చేయడంలో మహిళలకు నేర్పించడానికి ఆమె వివిధ జిల్లాలకు కూడా వెళ్తున్నారు. అంజు థాపా విజయవంతమైన మహిళా పారిశ్రామికవేత్తగా ఎదిగారు.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications