అనిల్ అంబానీ..ఈ పేరు ఒకప్పుడు టెలికం మార్కెట్లో సంచలనం.. రిలయన్స్ CDMA టెక్నాలజీ ఫోన్ తో ఎన్నో సంచలనాలు నమోదు చేసిన టెక్ నేత. నేడు మోసగాడిగా ముద్రపడిపోయాడు. ఒకప్పుడు ప్రపంచంలోనే ధనవంతుల జాబితాలో ఆరవస్థానంలోని నిలిచిన ఈ ధీరుడు ఇప్పుడు దివాళాతో పాతాళానికి పడిపోయాడు. దేశంలో ప్రముఖ వ్యాపారవేత్తలలో ఒకరిగా ఎదిగిన అనిల్ అంబానీ ఇప్పుడు పేదవాడిగా మారిపోయాడు. యెస్ బ్యాంక్ కు సంబంధించిన రూ. 3000 కోట్ల కుంభకోణానికి సంబంధించి ఆయన కార్యాలయాలపై ఈడీ దాడులు చేసింది. దేశంలోని అతిపెద్ద బ్యాంకు ఎస్బిఐ అతన్ని మోసగాడిగా ప్రకటించింది. ముఖేష్ అంబానీ- అనిల్ అంబానీ మధ్య గొడవకు కారణాలు ఏంటంటే..
అనిల్ అంబానీ జీవితం: 1986లో తండ్రి ధీరూభాయ్ అంబానీకి స్ట్రోక్ రావడంతో 1980లలో వ్యాపార ప్రపంచంలో అనిల్ అంబానీ ఎదుగుదల ప్రారంభమైంది. రిలయన్స్ ఆర్థిక లావాదేవీల రోజువారీ నిర్వహణను అనిల్ అంబానీ చేపట్టారు. 2002లో ధీరూభాయ్ మరణం తర్వాత, అనిల్ అంబానీ అతని అన్నయ్య ముఖేష్ అంబానీ సంయుక్తంగా రిలయన్స్కు నాయకత్వం వహించారు. అయితే, 2005లో నియంత్రణపై వివాదాలతో సోదరుల మధ్య చీలిక ఏర్పడింది. ఆస్తులతో పాటుగా వ్యాపారాలను ఇద్దరూ పంచుకున్నారు.

ముఖేష్ అంబానీ- అనిల్ అంబానీ మధ్య గొడవకు కారణాలు: భారతదేశపు అత్యంత ప్రతిష్టాత్మక పారిశ్రామిక కుటుంబాలలో ఒకటైన అంబానీ కుటుంబం లో, ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ మధ్య ఏర్పడిన గొడవకు మూడు ప్రధాన కారణాలు ఉన్నాయి:
1. ధీరూభాయ్ అంబానీ వారసత్వ ప్రణాళిక లేకుండానే మరణం: 2002లో రిలయన్స్ ఇండస్ట్రీస్ స్థాపకులు ధీరూభాయ్ అంబానీ ఆకస్మికంగా మరణించారు. ఆయన మరణానికి ముందు తమ కుమారులు ముఖేష్ మరియు అనిల్కు వ్యాపారాన్ని ఎలా పంచుకోవాలి అనే దానిపై ఎలాంటి స్పష్టమైన వీలునామా లేదా వారసత్వ ప్రణాళిక సిద్ధం చేయలేదు. దీని వల్ల ఇద్దరూ వ్యాపారాలపై నియంత్రణను గెలుచుకోవడానికి లోపలగానే పోటీలో పడిపోయారు. దీని వల్ల కుటుంబంలో అంతర్గత చీలికలు మొదలయ్యాయి.
2. వివిధ వ్యాపార దృక్పథాలు : అంబానీ బ్రదర్స్ మధ్య గొడవకు రెండవ ప్రధాన కారణం వారి వైవిధ్యభరిత వ్యాపార దృష్టికోణం. ముఖేష్ అంబానీ టెలికాం రంగంలో పెట్టుబడులు పెట్టాలని కోరుకున్నారు, ఎందుకంటే భవిష్యత్ భారతదేశంలో డేటా వినియోగం పెరిగే అవకాశాలు ఉన్నాయని ఆయన నమ్మారు. అయితే అనిల్ అంబానీ మాత్రం విద్యుత్ ఉత్పత్తి రంగంపై దృష్టి పెట్టాలనుకున్నారు. కానీ ఆ సమయంలో రిలయన్స్ గ్రూప్కు ఒకే ఒక్క ప్రాజెక్ట్లో పెట్టుబడి పెట్టే స్థోమత మాత్రమే ఉండగా, చివరికి ముఖేష్ పథకం ప్రాధాన్యత పొందింది. ఇది వారి మధ్య అసంతృప్తిని పెంచింది.
3. అనిల్ అంబానీ జీవనశైలి, వ్యక్తిగత ఎంపికలు: వివాదానికి మూడవ కారణంగా అనిల్ అంబానీ యొక్క ఆడంబరమైన జీవనశైలి పేర్కొనబడుతుంది. రాజకీయాల్లోకి ప్రవేశించి, సమాజ్వాదీ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. ఆయన ఫ్యాషన్, సినిమా ప్రపంచంకు చెందిన నటి టీనా మునిమ్ (ఇప్పటి టీనా అంబానీ) ను వివాహం చేసుకోవాలన్న నిర్ణయం అంబానీ కుటుంబంలో వ్యతిరేకతకు దారితీసింది. ఈ పెళ్లికి మొదట కుటుంబం ఒప్పుకోకపోయినా.. అనిల్ ఇంటిని వదిలేస్తానని చెప్పిన తర్వాత వారు అంగీకరించాల్సి వచ్చింది.
అంబానీ బ్రదర్స్ వ్యాపారంలో విభజన: 2005వ సంవత్సరంలో ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ మధ్య తీవ్రమైన వ్యాపార విభేదాలు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీశాయి. కుటుంబ విభేదాలు తీవ్రస్థాయికి చేరిన సమయంలో వారి తల్లి కోకిలాబెన్ అంబానీ ఇద్దరి మధ్య మధ్యవర్తిగా ప్రవేశించింది. రిలయన్స్ గ్రూప్ను సమానంగా విభజించి ఇద్దరికీ పంచడంలో కీలక పాత్ర పోషించారు.జూన్ 18, 2005 రిలయన్స్ గ్రూప్ను ఇద్దరు కొడుకులు విడిగా కేటాయిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
ముఖేష్ అంబానీకి ఎలాంటి కంపెనీలు దక్కాయి? : విభజనలో భాగంగా, ముఖేష్ అంబానీకి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL), ఇండియన్ పేట్రోకెమికల్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (IPCL) దక్కాయి. ఈ కంపెనీలు ముడి చమురు శుద్ధి, పెట్రోకెమికల్స్ ఉత్పత్తి, చమురు & గ్యాస్ అన్వేషణ రంగాల్లో ప్రసిద్ధి గాంచాయి. ఇవి అప్పటికే భారీగా లాభాలను ఆర్జిస్తున్న వ్యాపారాలు కావడం వల్ల, ముఖేష్కు బలమైన స్థితి ఏర్పడింది.
అనిల్ అంబానీకి దక్కిన వ్యాపారాలు : అనిల్ అంబానీకి విభజనలో భాగంగా రిలయన్స్ కమ్యూనికేషన్స్, రిలయన్స్ క్యాపిటల్, రిలయన్స్ పవర్ లాంటి కంపెనీలు దక్కాయి. ఈ వ్యాపారాలను కలిపి ఆయన అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్ (ADAG) అని పిలిచారు. ఈ సంస్థలు అప్పటి వరకు ఎక్కువ లాభాలు చూపకపోయినా, భవిష్యత్తులో భారీ వృద్ధికి అవకాశమున్న రంగాల్లో ఉన్నట్లు భావించబడింది. ముఖ్యంగా టెలికాం, ఫైనాన్స్ ఎనర్జీ రంగాలపై భవిష్యత్ ప్రభావం కనిపించింది. అనిల్ అంబానీ మౌలిక సదుపాయాలు, రక్షణ, వినోదం వంటి వివిధ రంగాలలోకి ప్రవేశించారు కానీ పరిమితంగానే విజయం సాధించారు.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..



Click it and Unblock the Notifications