Reliance Capital: అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ క్యాపిటల్ లిమిటెడ్ స్టాక్ మార్కెట్ నుంచి త్వరలో డీలిస్ట్ చేయబడుతోంది. రిలయన్స్ క్యాపిటల్ను హిందూజా గ్రూప్ కంపెనీ ఇండస్ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ కొనుగోలు చేసిన తరుణంలో తాజా పరిణామం వచ్చింది.
అంటే ఇకపై దేశీయ స్టాక్ మార్కెట్లలో రిలయన్స్ క్యాపిటల్ షేర్లు ట్రేడ్ చేయబడవు. ఎందుకంటే కంపెనీ కొత్త యజమాని అంటే హిందూజా గ్రూప్ ద్వారా షేర్లను డీలిస్ట్ చేయాలని నిర్ణయించటమే దీనికి ప్రధాన కారణం. వాస్తవానికి 2008లో కంపెనీ షేర్ ధర ఒక్కోటి రూ.2,700 కంటే ఎక్కువగా ఉంది. అయితే నేడు షేర్ ధర దాదాపు 99 శాతం క్షీణించి ప్రస్తుతం రూ.11 స్థాయిల వద్ద ఉంది. షేర్ల డీలిస్టింగ్ జరిగితే ఈక్విటీ షేర్ హోల్డర్ల పెట్టుబడి విలువ సున్నా కాబోతోంది.

కొత్తగా కొనుగోలు చేసిన కంపెనీ పాత కంపెనీలోని ఇన్వెస్టర్లకు ఎలాంటి వాటాలు ఇవ్వబోదని వెల్లడైంది. దీనివల్ల అనిల్ అంబానీ కంపెనీలో షేర్లు కలిగి ఉన్న వ్యక్తులకు భారీగా నష్టం జరగనుంది. ఇప్పటికే రిలయన్స్ క్యాపిటల్పై నియంత్రణ సాధించేందుకు హిందూజా గ్రూప్ కంపెనీ ఇండస్ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ సమర్పించిన రూ.9,650 కోట్ల రిజల్యూషన్ ప్లాన్ను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ గత మంగళవారం ఆమోదించింది. ఇందులో రుణదాతలు 63 శాతం బకాయి నష్టాన్ని భరించాల్సి ఉంటుంది. అలాగే కంపెనీకి వ్యతిరేకంగా చేసిన మొత్తం రూ.38,526.42 కోట్ల క్లెయిమ్లలో రూ.26,086.75 కోట్ల క్లెయిమ్లను మాత్రమే ట్రిబ్యునల్ ఆమోదించింది.
2021 నుంచి ప్రక్రియ ప్రారంభం అడ్మినిస్ట్రేటివ్ సమస్యలు మరియు చెల్లింపు డిఫాల్ట్ల కారణంగా అనిల్ ధీరూభాయ్ అంబానీగ్రూప్ కంపెనీ రిలయన్స్ క్యాపిటల్ డైరెక్టర్ల బోర్డుని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నవంబర్ 2021లో తొలగించింది. రిలయన్స్ క్యాపిటల్ రూ.38,000 కోట్లకు పైగారుణాన్ని కలిగి ఉంది. నలుగురు దరఖాస్తుదారులు ప్రారంభంలో రిజల్యూషన్ ప్లాన్లతో బిడ్ చేశారు. అయినప్పటికీ తక్కువ బిడ్ ధర కారణంగా రుణదాతల కమిటీ వాటిని తిరస్కరించింది.


Click it and Unblock the Notifications