మన ఆంధ్రప్రదేశ్ ఎకానమీ ఇప్పుడు ఫుల్ ఫామ్లో పరుగులు తీస్తోంది. మొదటి మూడు నెలల్లోనే 10.5% వృద్ధి సాధించింది. ఇది దేశ సగటు 8.8% కంటే ఎక్కువ. దాంతో జోష్లోకి వెళ్లిన సీఎం చంద్రబాబు, "ఇక్కడ ఆగిపోవద్దు... వచ్చే ఏడాదికి 17% వృద్ధి దిశగా కదలాలి" అంటూ అధికారులకు క్లియర్ డైరెక్షన్ ఇచ్చేశారు.

ఏ ఫీల్డ్ లో వృద్ధి పెరిగింది అంటే పరిశ్రమలే ముందంజలో ఉన్నాయి. ఈసారి ఆ రంగం "11.91% వృద్ధి" సాధించింది. మైనింగ్ నుంచి మాన్యుఫాక్చరింగ్, కన్స్ట్రక్షన్ వరకూ బాగా రాణించాయి. తర్వాత సర్వీసులు కూడా వెనుకాడలేదు. ట్రేడ్, హోటల్స్, రెస్టారెంట్లు, రియల్ ఎస్టేట్ ఇలా అన్నీ కలిపి "10.70% వృద్ధి" సాధించాయి. ఇక రైతులు కూడా తగ్గేది లేదంటూ వ్యవసాయాన్ని పరుగులు పెట్టించారు. దీంతో ఆ రంగంలో ఏపీ 9.60% వృద్ధి సాధించింది. పశుసంవర్థకంలో నుంచి చేపల ఉత్పత్తి వరకూ పాజిటివ్ నెంబర్స్ వచ్చాయి.
పశుసంవర్థకం స్థిరంగా 6.65% గ్రోత్ రాబట్టింది. కానీ అసలైన బ్లాస్ట్ మాత్రం చేపల, ఆక్వా రంగంలో జరిగింది. ఏకంగా 14.52% వృద్ధి నమోదు చేసి, దాదాపు రూ. 32,110 కోట్ల టర్నోవర్ సాధించింది. ఇది చిన్న అక్వా ఫార్మర్లకైనా, పెద్ద ఆక్వా ప్రాజెక్టులకైనా ఒక బూస్ట్ లాంటిదే.
ఇక మాంసం, గుడ్ల ఉత్పత్తి కూడా గణనీయంగా పెరగడంతో, రైతులకే కాదు, గ్రామీణ కుటుంబాల ఆదాయానికీ డైరెక్ట్గా లాభం కలిగింది. అంటే ఫుడ్ ప్రొడక్షన్ పెరిగింది, మార్కెట్లో డిమాండ్ కూడా హైగా ఉంది. రెండూ కలిసి రైతుల జేబులో అదనపు ఇన్కమ్ జమయ్యేలా చేశాయి. అగ్రికల్చర్ రంగం ఈసారి డబుల్ ఇంపాక్ట్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఉత్పత్తి పెరిగింది, రైతు ఆదాయం కూడా పెరిగింది.
పరిశ్రమలు, మౌలిక వసతుల రంగం ఈసారి బాగానే దూసుకెళ్లింది. మొదట మైనింగ్ ఇది ఏకంగా 43.54% వృద్ధి సాధించింది. అంటే రాష్ట్రంలో సహజ వనరుల వినియోగం బలంగా పెరిగిందనే అర్థం. ఇక మాన్యుఫాక్చరింగ్ రంగం 9.93% వృద్ధి సాధించగా, కన్స్ట్రక్షన్ రంగం కూడా 9.57% పెరిగింది. ఈ నెంబర్లు చూస్తే ఒక్క విషయం క్లియర్ రాష్ట్రంలో రోడ్లు, భవనాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు వేగంగా నడుస్తున్నాయి. అంటే ఇన్వెస్ట్మెంట్స్ పెరిగి, ఉద్యోగాలు కూడా పెరిగే అవకాశం ఎక్కువన్నమాట.
సర్వీసుల రంగంలో మంచి వృద్ధి కనిపిస్తోంది. హోటల్స్, రెస్టారెంట్లు, ట్రేడ్ సంబంధిత వ్యాపారాలు సుమారుగా 17.92% పెరిగాయి. టూరిజం రంగం కూడా మంచి జోరులో ఉంది, పర్యాటకుల సంఖ్య 6.89 కోట్ల నుంచి 8.07 కోట్ల వరకు చేరింది. అంతేకాదు, ఎయిర్ ప్యాసింజర్స్ కూడా 21% పెరగడం సానుకూల సంకేతం అని చెప్పవచ్చు. మొత్తం చూస్తే, సర్వీసులు రంగంలో పాజిటివ్ ట్రెండ్ స్పష్టంగా ఉంది.
సీఎం అభిప్రాయం ప్రకారం, ఆంధ్రప్రదేశ్కి ఉన్న "దీర్ఘ తీరరేఖ, పోర్టులు, సహజ వనరులు, ఆక్వా బేస్" వంటివి బలమైన పాయింట్స్. వీటిని సరిగ్గా వినియోగిస్తే, రాష్ట్రం 25% వరకు వృద్ధి సాధించే స్థాయిలో ఉంది.
ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు వేగంగా ముందుకు వెళ్లిపోతుంది. వృద్ధి గణాంకాలు బాగున్నప్పటికీ, 17% వృద్ధి టార్గెట్ చేరుకోవాలంటే కొన్ని ముఖ్యమైన విషయాలు అవసరం. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్లను ఆకర్షించడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్లను వేగంగా పూర్తి చేయడం, వ్యవసాయంలో ఆధునిక టెక్నాలజీని ఉపయోగించడం, అలాగే సర్వీసులను మరింత బలోపేతం చేయడం ముఖ్యమని చెప్పాలి.
ఒక మాటలో చెప్పాలంటే, ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు "గ్రోత్ రేస్"లో స్పీడ్ పెంచేసింది. ఈ వేగం కొనసాగితే, రాష్ట్రం నిజంగానే దేశంలో టాప్ ఎకానమీస్లో ఒకటిగా మారొచ్చు.
More From GoodReturns

Bengaluru: టీసీఎస్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్! మీ స్నేహితుడిని చేర్పించండి.. రూ. 40,000 గెలుచుకోండి!

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

Silver: వార్ ఎఫెక్ట్.. సోమవారం మార్కెట్లు తెరిచేసరికి వెండి ధర ఎక్కడ ఉంటుందో తెలుసా?

Gold: బంగారం ధరలు తగ్గేది అందుకు కాదు! అసలు విషయం బయటపెట్టిన వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ సీఈఓ!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

పెరుగుతున్న బంగారం ధరలు.. అదే స్థాయిలో పెరుగుతున్న పసిడి రుణాలు.. ఎందుకు తాకట్టు పెడుతున్నారు..

బంగారం ధర పెరగడంతో వినియోగదారులు కొత్త స్కెచ్.. రూ.4 లక్షల కోట్లు దాటిన పసిడి రుణాలు..

Bengaluru: కర్ణాటకలో మరో సిలికాన్ వ్యాలీ? ఆ సిటీ బెంగళూరుకి ప్రత్యామ్నాయం అవుతుందా?

బెంగళూరు-హైదరాబాద్ మధ్య ప్రయాణం గంటలే.. 110 కి.మీ.వేగంతో కొత్త రైలు వచ్చేస్తోంది.. ఎప్పుడంటే..

బెంగళూరు ట్రాఫిక్ కష్టాలు తీరినట్లే.. 11 ఇంటర్ఛేంజెస్ కనెక్టివిటితో బిజినెస్ కారిడార్ రెడీ..



Click it and Unblock the Notifications