ఆనంద్ మహీంద్ర గిప్ట్: ఆరుగురు టీమిండియా ప్లేయర్లకు కార్లు బహుమానం..
గబ్బాలో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఆ టెస్టులో కీ రోల్ పోషించిన వారికి ప్రముఖ పారిశ్రామిక వేత్త, మహీంద్ర గ్రూపు అధినేత ఆనంద్ మహీంద్రా బహుమతిని ప్రకటించారు. ఆరుగురు క్రికెటర్లకు థార్ ఎస్యూవీ అందజేస్తామని తెలిపారు. ఆ టెస్ట్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఆరుగురి పేర్లను ప్రకటించారు.
మహ్మద్ సిరాజ్, నవదీప్ సైనీ, శార్దుల్ ఠాకూర్, టీ నాటరాజన్, వాషింగ్టన్ సుందర్, శుభ్మన్ గిల్కు కార్లు అందజేస్తామని తెలిపారు. చారిత్రాత్మక టెస్ట్ సిరీస్ భారత్ తీసుకురావడంలో వీరు విశేష కృషి చేశారని తెలిపారు. ఈ ఆరుగురు కుర్రాళ్లకు ఆదర్శంగా నిలుస్తారని చెప్పారు. వీరు భారత క్రికెట్ కలలను నెరవేరుస్తారని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.
యువ క్రికెటర్లు ఆదర్శంగా నిలిచారని ఆనంద్ మహీంద్రా కొనియాడారు. వారికి కార్లు బహుమతి ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. తన సొంత డబ్బులతో కార్లు అందజేస్తున్నామని చెప్పారు. కంపెనీ నుంచి కాకుండా.. తన సొంత నిధులతో కార్లను కొనుగోలు చేస్తానని తెలిపారు.