ప్రయాణీకులకు ఎయిరిండియా అనుబంధ సంస్థ బంపరాఫర్
ఎయిరిండియా అనుబంధ సంస్థ అలయన్స్ ఎయిర్ ప్రయాణీకులకు ఆఫర్ ఇచ్చింది. అలయెన్స్ ఎయిర్ సేల్ పేరుతో ప్రయాణీకులకు రూ.999కే టిక్కెట్ అందిస్తోంది. ఈ తగ్గింపు రేట్లలో 60,000 సీట్లను ఆఫర్ చేస్తోంది. ఈ ఆఫర్ సేల్ శనివారం మార్చి 13వ తేదీ నుండి సోమవారం మార్చి 15 వరకు ఉంటుంది. ఈ మూడు రోజులు ఆఫర్ సేల్ ఉంటుంది.
ఈ ఆఫర్ ద్వారా బుక్ చేసుకున్న టికెట్ ద్వారా ప్రయాణీకులు ఏప్రిల్ 1వ తేదీ నుండి 2021 సెప్టెంబర్ 30వ తేదీ వరకు ప్రయాణం చేయవచ్చు. సీట్లు ఉన్నంత వరకు ముందుగా ఎవరు టిక్కెట్ బుక్ చేసుకుంటే వారికి ఈ ఆఫర్ వర్తిస్తుంది. వివిధ మార్గాల్లో ఈ ఆఫర్ అందుబాటులో ఉంది.
ఢిల్లీ-జైపూర్/ప్రయాగ్ రాజ్, హైదరాబాద్-బెలగామ్, అహ్మదాబాద్-కాండ్లా, బెంగళూరు-కొచ్చి /కోజికోడ్ వంటి నగరాలకు అందుబాటులో ఉంది. అంతేకాదు బయలుదేరడానికి ఒక వారం ముందు తేదీని ఉచితంగా మార్చకోడానికి కూడా వెసులుబాటు ఉన్నట్లు ఎయిర్లైన్స్ ఓ ప్రకటనలో తెలిపింది.