దేశంలో విమాన ఛార్జీలు వేగంగా పెరుగుతున్నాయి. గత 6 త్రైమాసికాల్లో దాదాపు 40 శాతం పెరిగాయి. అయినప్పటికీ ఇతర దేశాలతో పోల్చితే ఇది తక్కవేనని చెబుతున్నారు. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పౌర విమానయాన మార్కెట్లలో భారతదేశం ఒకటి. ప్రతిరోజూ దాదాపు 4.5 లక్షల మంది ప్రయాణికులు వివిధ విమానయాన సంస్థల ద్వారా ప్రయాణిస్తున్నారు. ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, దేశంలోని మొత్తం జనాభాలో చాలా తక్కువ భాగం ప్రస్తుతం విమానాల్లో ప్రయాణిస్తున్నారు.
ఏవియేషన్ కన్సల్టెన్సీ సంస్థ (CAPA) ఇండియా ప్రకారం, గత రెండు దశాబ్దాల్లో దేశంలోని టాప్ 20 రూట్లలో సగటు ఛార్జీలు స్వల్పంగా పెరిగాయి. కానీ, గత ఆరు త్రైమాసికాల్లో దాదాపు 40 శాతం ఛార్జీలు పెరిగాయి. వీటిలో ముంబై-ఢిల్లీ, బెంగళూరు-ఢిల్లీ, బెంగళూరు-ముంబై మరియు ఢిల్లీ-హైదరాబాద్ మార్గాల్లో ఛార్జీలు పెరిగాయి. దాదాపు 150 విమానాల కొరత కారణంగా ఈ ఛార్జీల పెంపు జరిగింది. ఈ ఛార్జీల పెరుగుదల ఆర్థిక సంవత్సరం 2026 వరకు కొనసాగుతుందని అంచనా.

కరోనా మహమ్మారి తర్వాత ఛార్జీలు భారీగా పెరిగాయి. అయినప్పటికీ భారతదేశంలో సగటు ఛార్జీలు ప్రపంచంలోనే అత్యల్పంగా ఉన్నాయి. ఢిల్లీ-ముంబై మధ్య సగటు ఛార్జీ దాదాపు రూ.5,000గా ఉంటుందని ఇంటర్గ్లోబ్ టెక్నాలజీ కోటియంట్ లిమిటెడ్ ప్రెసిడెంట్, సీఈఓ సంజయ్ కుమార్ తెలిపారు. అయితే, ద్రవ్యోల్బణం పరంగా ఇది చాలా ఎక్కువ కాదన్నారు. భారతీయులు ధరల పట్ల సున్నితంగా ఉంటారని ఆయన అన్నారు.
తక్కువ విమాన ఛార్జీల ఒత్తిడి కారణంగా, చాలా విమానయాన సంస్థలు భారతదేశం నుంచి తమ సేవలు మూసివేయాల్సి వచ్చింది. ఏవియేషన్ అనలిటిక్స్ సంస్థ సిరియమ్ డేటా ప్రకారం, భారతదేశ సగటు దేశీయ విమాన ఛార్జీలు 2023 సంవత్సరంలో అత్యల్పంగా ఉన్నాయి. భారతదేశంలో సగటు ఎకానమీ క్లాస్ ధర 622 మైళ్ల దూరానికి US$80 అయితే ఆస్ట్రేలియాలో 768 మైళ్లకు US$167 మరియు బ్రెజిల్లో 709 మైళ్లకు US$114గా ఉన్నాయి. USలో అదే ధర 1,108 మైళ్లకు US$180, చైనాలో 860 మైళ్లకు US$126, యూరోప్లో 813 మైళ్లకు US$106 మరియు కెనడాలో 928 ఏమైళ్లకు US$173గా ఉంది.


Click it and Unblock the Notifications