Adani: అంబానీ పవర్ ప్లాంట్పై అదానీ కన్ను.. ఈ డీల్ ఫినిష్ అయితే జరిగేదిదే..
Adani: అంబానీలకు చెందిన ఓ పవర్ ప్లాంటును అదానీ గ్రూపు కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. దివాళా స్థితిలో ఉన్న అనిల్ అంబానీకి చెందిన కోల్ ప్లాంట్ ను వేలం ద్వారా దక్కించుకోవాలని గౌతమ్ అదానీ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇదే సమయంలో రిలయన్స్ పవర్ పై నియంత్రణను తిరిగి పొందేందుకు మరోపక్క అనిల్ సైతం గట్టిగా ప్రయత్నిస్తున్నారట.
సెంట్రల్ ఇండియాలో ఉన్న విదర్భ ఇండస్ట్రీస్ పవర్ లిమిటెడ్ ను అనిల్ అంబానీ రుణదాతలు వేలం వేయనున్నారు. 600 మెగావాట్ల ఉత్పత్తి దీని సామర్థ్యం. అదానీ గ్రూపులో ఈ ప్రక్రియలో పాల్గొంటోంది. ఎలాగైనా ప్లాంట్ ను దక్కించుకోవాలని చూస్తోంది. కానీ వేలంలో తీవ్ర పోటీ ఎదురుకావచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఒకవేళ ఈ ప్లాంట్ ని అదానీ గ్రూపు చేజిక్కించుకుంటే, హిండెన్ బర్గ్ రీసెర్చ్ నివేదిక వల్ల జరిగిన నష్టాన్ని కొంత భర్తీ చేసినట్లేనని భావిస్తున్నారు. కానీ సంస్థపై నియంత్రణ కోల్పోవడానికి అనిల్ అంబానీ సైతం సిద్ధంగా లేరు. ఇందుకోసం ఆస్తిని ఆఫర్ చేసి, తన పట్టు బిగించాలని ప్లాన్ చేస్తున్నారు.
ఈ వార్తలపై అటు అదానీ గ్రూపు కానీ, ఇటు రిలయన్స్ పవర్ కానీ స్పందించలేదు. కానీ ఈ డీల్ ఫినిష్ అయితే అనిల్ అంబానీ పరిస్థితి మరింత దిగజారినట్లేనని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. మరి ఈ గండం నుంచి ఆయన గట్టెక్కుతారో లేదా అదానీ గ్రూపుకు విదర్భ ప్లాంట్ ను అప్పగిస్తారో వేచి చూడాలి మరి!


Click it and Unblock the Notifications