దేశంలో 125 కోట్ల మందికి ఆధార్ కార్డు
దేశవ్యాప్తంగా 125 కోట్ల మంది ప్రజలకు ఆధార్ ఉన్నట్లు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) శుక్రవారం తెలిపింది. ఆధార్ను ప్రాథమిక గుర్తింపు పత్రంగా ఉపయోగించడం గణనీయంగా పెరుగుతోందని పేర్కొంది. ప్రతి రోజు 3 కోట్లకు పైగా ఆధార్ ఆధారిత గుర్తింపు ధృవీకరణ అభ్యర్థనలు నమోదవుతున్నట్లు తెలిపింది.
ఇండియన్ రైల్వేలో పెరగనున్న భోజనం, టిఫిన్ ధరలు, ఎంతంటే?
అలాగే ఆధార్ వివరాల అప్ డేట్ అభ్యర్థనలు కూడా రోజుకు మూడు నుంచి నాలుగు లక్షల మేర వస్తున్నాయని పేర్కొంది. ఆధార్ వ్యవస్థ ప్రారంభం నుంచి 37,000 కోట్లసార్లు ఉపయోగించబడినట్లు తెలిపింది. 331 కోట్ల బయోమెట్రిక్, డెమోగ్రాఫిక్ ఆధార్ అప్ డేట్స్ చేసినట్లు తెలిపింది.
ఇప్పటికీ ప్రతి రోజు మూడు నుంచి నాలుగు లక్షల మేర ఆధార్ అప్ డేట్స్ అభ్యర్థనలు వస్తున్నట్లు తెలిపింది. ఆధార్ కార్డును 2010లో కేంద్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసిన విషయం తెలిసిందే. ఇటీవల ఆదాయపు పన్ను శాఖ కూడా పాన్ కార్డుకు బదులు ఆధార్ ద్వారా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసే వెసులుబాటును కల్పించింది.