పాన్-ఆధార్ లింక్ చేయలేదా.. మీకు ఊరట: మార్చి 31 వరకు గడువు పొడిగింపు
ఢిల్లీ: పాన్ కార్డు-ఆధార్ కార్డు లింక్ చేసుకోని వారికి ఊరట! ఈ గడువును సీబీడీటీ పొడిగించింది. పాన్-ఆధార్ లింకింగ్ను ఇప్పటికే పలుమార్లు పొడిగించింది. ఇప్పుడు డిసెంబర్ 31, 2019 చివరి తేదీ కాగా, దీనిని మరో మూడు నెలల పాటు పొడిగించింది. వచ్చే ఏడాది (2020) మార్చి 31వ తేదీ వరకు దీనిని పొడిగించింది.
పాన్-ఆధార్ అనుసంధానం ఈ ఏడాది ఏప్రిల్ నెలలో కేంద్రం తప్పనిసరి చేసింది. ఇటీవల ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే వారికి తప్పనిసరి అయింది. డిసెంబర్ 31వ తేదీలోపు ఆధార్ అనుసంధానం చేయకపోతే పాన్ కార్డు చెల్లదని ఐటీ శాఖ తెలిపింది.
పాన్-ఆధార్ లింక్కు 3 రోజులే గడువు: లింక్ చేయకుంటే ఏమౌతుంది.. సమస్యలెన్నో?
పాన్ - ఆధార్ లింకింగ్ తేదీని పొడిగిస్తూ ఆదాయపు పన్ను శాఖ సోమవారం రాత్రి ట్వీట్ చేసింది. ఆధార్ - పాన్ కార్డు అనుసంధానంపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (CBDT) గడువును పొడిగించడం ఇది ఎనిమిదోసారి.