'బేటీ బచావో బేటియో పఢావో' భాగంగా కేంద్ర ప్రభుత్వం 2015 సంవత్సరంలో సుకన్య సమృద్ధి యోజన (SSY) పథకాన్ని ప్రారంభించింది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద ఈ పథకంలో సంవత్సరానికి రూ.1.50,000 పన్ను మినహాయింపు పొందవచ్చు. కేంద్ర ప్రభుత్వం సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేటును 8.2 శాతంగా చెల్లిస్తుంది. ఈ SSY వడ్డీ రేటు ప్రతి త్రైమాసికంలో మారవచ్చు కానీ మెచ్యూరిటీ సమయంలో దాదాపు 8 శాతం నికర రాబడిని ఆశించవచ్చు.
SSY ఖాతాలో నెలకు రూ.12,500 లేదా సంవత్సరానికి రూ.1.50 లక్షలు పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే, ఆ అమ్మాయికి 21 ఏళ్లు వచ్చేసరికి దాదాపు రూ.69 లక్షలు వస్తాయి. అమ్మాయికి 14 ఏళ్లు వచ్చిన నుంచి అమ్మాయికి 18 ఏళ్లు మధ్య మెచ్యూరిటీ మొత్తంలో 50 శాతం విత్డ్రా చేసుకోవచ్చు. మిగిలిన మెచ్యూరిటీ మొత్తాన్ని ఆడపిల్లకి 21 ఏళ్లు వచ్చినప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు.

సుకన్య సమృద్ది యోజన పథకం ఖాతా పోస్టాఫీస్ లో తెరవచ్చు. ఈ పథకంలో మీరు నెలనెలా జమ చేయవచ్చు లేదా రెండు లేదు మూడు నెలలు లేదా సంవత్సరానికి ఒకసారి జమ చేయవచ్చు. సంవత్సరంలో రూ.1,50,000 జమ చేసే వరకు ఎన్నిసార్లైనా ఖాతాలో డబ్బు జమ చేయవచ్చు. ఈ ఫథకంలో సంవత్సరానికి కనీసం రూ.250 జమ చేయాలి. గరిష్ఠంగా రూ.1,50,000 జమ చేయవచ్చు.
సుకన్య సమృద్ధి యోజన ఫథకంలో సంవత్సరానికి కనీసం రూ.250 జమ చేయకుంటే ఖాతా ఇన్ యాక్టివ్ అవుతుంది. ఈ ఖాతా ఉన్నవారు ఇప్పటికీ కూడా కనీసం రూ.250 కూడా చెల్లించకపోతే.. మార్చి 31 లోపు రూ.250 చెల్లించాలి. లేకుంటే ఖాతా ఇన్ యాక్టివ్ అవుతుంది.
More From GoodReturns

March 31: రేపటితో ముగియనున్న ఆర్థిక సంవత్సరం.. ఈ 15 పనులు చేయకపోతే భారీ జరిమానా!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications