ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడి కోట్లాది రూపాయలు ఆర్జించిన ఆరోపణల పైన అమెరికాలో ఏడుగురు భారత సంతతి వ్యక్తులపై ఫెడరల్ అధికారులు అభియోగాలు నమోదు చేశారు. ఈ స్కీం ద్వారా వీరు మిలియన్ డాలర్ల మేర లాభం పొందినట్లు పేర్కొన్నారు. రెండేళ్ల క్రితం వీరు ఈ మోసానికి పాల్పడగా, ఆలస్యంగా వెలుగు చూసింది. హరిప్రసాద్ సూరె (34), లోకేష్ లగుడు(31), చోటు ప్రభు తేజ్ పులగమ్ (29) స్నేహితులు. వీరు ముగ్గురు స్వేహితులు ట్విలియోలో సాఫ్టువేర్ ఇంజినీర్లుగా పని చేస్తున్నారు. ఈ కంపెనీ శాన్ఫ్రాన్సిస్కోలో ఉంది.
2020లో హరి ప్రసాద్ ట్విలియో కంపెనీ భవిష్యత్తు ప్రణాళికకు సంబంధించి రహస్య సమాచారాన్ని తన స్నేహితుడు దిలీప్ కుమార్ రెడ్డికి చేరవేశాడు. లోకేష్ తన గర్ల్ ఫ్రెండ్, మరో స్నేహితుడు అభిషేక్కు కంపెనీ విషయాలను చెప్పాడు. ప్రభుతేజ్ కూడా తన సోదరుడు చేతన్ ప్రభుకు తెలిపాడు.

కంపెనీ సమాచారం అందుకున్న వారు ట్విలియో ఆప్షన్స్లో సక్సెస్ఫుల్గా ట్రేడిగ్ చేశారు. 2020 మార్చిలో ఈ స్నేహితులు ముగ్గురు ట్విలియో రెవెన్యూకు సంబంధించిన డేటా బేస్లను యాక్సెస్ చేశారు. దీని ద్వారా కంపెనీ కస్టమర్లు సమాచారాన్ని తెలుసుకున్నారు. కరోనా సమయంలో ట్విలియో కంపెనీ ఉత్పత్తులు, సేవల వినియోగం పెరిగింది.
ఈ వివరాలతో కంపెనీ త్రైమాసిక ఫలితాల్లో వెల్లడిస్తే కచ్చితంగా ట్విలియో షేర్ల ధర పెరుగుతుందని గుర్తించారు. ఈ విషయాన్ని వారు తమ స్నేహితులు, బంధువులకు సమాచారం అందించారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ ద్వారా ఈ ఏడుగురు 1 మిలియన్ డాలర్లకు పైగా అక్రమంగా ఆర్జించినట్లు దర్యాఫ్తులో తేలింది. ఇందులో తెలుగు వ్యక్తులు ఉన్నారు.
More From GoodReturns

విశ్వ విజేతగా భారత్.. కళ్లు చెదిరే నజరానా.. ICC Men's T20 World Cup 2026 ప్రైజ్ మనీ పూర్తి వివరాలు ఇవే..

నేస్తం నేనున్నా.. భారత్కు అండగా నిలిచిన రష్యా.. చమురు సంక్షోభంపై కీలక ప్రకటన..

ఎర్ర సముద్రంలో కల్లోలం..భారత ఎగుమతులపై భారీ ఎఫెక్ట్..తడిసిమోపెడవుతున్న ఛార్జీలు..

యురేనియం నుంచి వాణిజ్యం వరకు.. మోదీ–కార్నీ భేటీలో జరిగిన ఒప్పందాలు ఇవే..

భారత స్టాక్ మార్కెట్లు పతనం.. చమురు ధరలు పెరగడంతో కుప్పకూలిన మార్కెట్

ఇరాన్ యుద్ధంతో స్టాక్ మార్కెట్లో భయాందోళన..728 పాయింట్లు పడిపోయిన గిఫ్ట్ నిఫ్టీ.. భారీగా పెరిగిన ఇండియా VIX..

Investment: మార్కెట్ ఒడిదుడుకులకు భయపడుతున్నారా? ఈ టైంలో ధనవంతులు ఏం చేస్తారో తెలుసా?

Stock market: మార్కెట్ షాక్ ఇచ్చినా భయం వద్దు.. ఇన్వెస్టర్లకు ఇవే సేఫ్ ఆప్షన్లు!

Sensex today: సెన్సెక్స్ సంచలనం: 20 నిమిషాల్లో 900 పాయింట్లు జంప్.. కారణం ఇదే!

కుప్పకూలిన ఆసియా స్టాక్ మార్కెట్.. దెబ్బకు దక్షిణ కొరియా మార్కెట్లో నిలిచినపోయిన ట్రేడింగ్..

మూడో రోజూ కుప్పకూలిన స్టాక్ మార్కెట్..రికార్డు కనిష్టానికి రూపాయి.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన..



Click it and Unblock the Notifications