సుందర్ పిచాయ్(గూగుల్), సత్య నాదెళ్ల(గూగుల్), అజయ్ బంగా(మాస్టర్ కార్డ్) ఇలా వివిధ దేశాల్లోని దిగ్గజ కంపెనీల్లో కీలకస్థాయిలో ఉన్నారు. వీరి ఆధ్వర్యంలోని కంపెనీల్లో 11 దేశాల్లో 3.6 మిలియన్ల మందికి పేగా అంటే 36 లక్షల కంటే ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. ఆయా దేశాలకు ప్రతి సంవత్సరం 76 లక్షలకోట్ల ఆదాయం (లక్ష కోట్ల డాలర్లు) వస్తోంది. ఈ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ 4 లక్షల కోట్లుగా ఉంది. ఈ మేరకు ఇండియాస్పోరా అనే స్వచ్చంధ సంస్థ 58 మంది పేర్లతో జాబితాను విడుదల చేసింది.

వీరి హయంలో దూసుకెళ్లిన కంపెనీలు
అమెరికా, సింగపూర్, కెనడా, ఇంగ్లాండ్ సహా పదకొండు దేశాల్లో 58 మంది కంపెనీలకు నాయకత్వం వహిస్తున్నారు. భారతీయ మూలాలు కలిగిన బిజినెస్ లీడర్స్ గతంలో కంటే ఎక్కువసంఖ్యలో ఆయా కంపెనీలకి నాయకత్వం వహిస్తున్నారు. భారతీయులు టాప్ పొజిషన్లో ఉన్న కాలంలో ఈ కంపెనీల వార్షిక రిటర్న్స్ సగటున 23 శాతంగా ఉన్నాయి. ఎస్ అండ్ పీ 500లో 10 శాతం పెరిగింది. 36 లక్షలకు పైగా ఉద్యోగులు ఉన్నారు.

బ్యాంకింగ్, టెక్, ఫైనాన్స్ సహా వివిధ రంగాల్లో
భారత్ మూలాలు కలిగిన టెక్ దిగ్గజాలు.. వారు సాధిస్తున్న విజయాలను పరిచయం చేయాలని భావించినట్లు సిలికాన్ వ్యాలీ నుండి కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇండియాస్పోరా ఫౌండర్ ఎంఆర్ రంగస్వామి అన్నారు. మనవారు వివిధ వ్యాపారాలలో తమదైన సామర్థ్యాన్ని నిరూపించుకుంటున్నారని, వారు ఎంతో ప్రభావం చూపిస్తున్నారని, అందుకే ఈ నివేదికను తయారు చేశామని, వారు మరింత ఉన్నత స్థానానికి ఎదుగుతారని ఆశిస్తున్నట్లు చెప్పారు. కేవలం టెక్ రంగంలోనే కాకుండా బ్యాంకింగ్, ఎలక్ట్రానిక్స్, కన్స్యూమర్ గూడ్స్, కన్సల్టింగ్ వంటి వివిధ రంగాల్లో దూసుకెళ్లారని చెప్పారు.

కరోనా సమయంలో సహకారం
ఈ జాబితాలో 37 ఏళ్ల వయస్సు వారు, అలాగే 74 ఏళ్ల వయస్సు వారు ఉన్నారని, సగటు వయస్సు 54 అని రంగస్వామి చెప్పారు. కరోనా సమయంలోనూ ఈ కంపెనీలు మానవతా దృక్పథంతో తమదైన మేరకు సహాయం చేశాయన్నారు. అలాగే ఉద్యోగులను, కస్టమర్లకు కంపెనీ తరఫున అండదండలు అందించారని చెప్పారు. కరోనాపై స్పందించడంతో పాటు బ్లాక్స్ అంశంలో స్పందించారని తెలిపారు.

భారత్తో పాటు వివిధ దేశాల్లో జన్మించారు
ఈ జాబితాలో ఇండియాలో జన్మించిన వారితో పాటు ఉగాండ, ఇథియోపియా, ఇంగ్లాండ్, అమెరికాలో జన్మించినవారు కూడా ఉన్నారని తెలిపారు. బిజినెస్లో ఎంతో దూరం వచ్చామని, ఇది ఆశ్చర్యంగా ఉందని చెబుతున్నారు. పెప్సికో ఇంద్రానూయి, హర్మాన్ ఇంటర్నేషనల్ దినేష్ పాలివాల్ వంటి వారు కూడా అత్యున్నత స్థాయికి చేరుకున్నారు.

స్ఫూర్తిదాయకం
భారత్కు చెందిన వారు వ్యాపారాల్లో, సమాజంలో కీలక పాత్ర పోషిస్తున్నారని, ఇది స్ఫూర్తిదాయకం అని మాస్టర్ కార్డ్ సీఈవో అండ్ ప్రెసిడెంట్ అజయ్ బంగా అన్నారు. ఈ 58 మందిలో మహిళలు 5గురు ఉన్నారు. జాబితాలో చోటు దక్కించుకోవడం గౌరవంగా ఉందని వర్టెక్స్ ఫార్మా సీఈవో, ఎండీ రేష్మ అన్నారు. సత్య నాదెళ్ల, అజయ్ బంగా, సుందర్ పిచాయ్, శంకర్ నారాయణ్, వసంత్ నరసింహన్, అర్వింద్ కృష్ణ, లక్ష్మీ మిట్టల్, రాజ్ సుబ్రమణియమ్, వివేక్ శంకరన్, పునీత్ రెన్ జెన్, భారత్ మస్రానీ, మైక్ మోహన్ వంటి వారు ఉన్నారు.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications