ఒక వైపు డిజిటల్ వ్యాలెట్లు, మరోవైపు క్రెడిట్, డెబిట్ కార్డులు, ఇంకోవైపు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఇన్ని రకాల సదుపాయాలు ఉన్నప్పటికి దేశంలో కరెన్సీ వినియోగం మాత్రం తగ్గడం లేదు. కరెన్సీ చలామణి ఇంకా పెరుగుతూనే ఉంది. ఇందుకు తాజా గణాంకాలే నిదర్శనం. అక్టోబర్ 4 తో ముగిసిన వారానికి దేశంలో కరెన్సీ చలామణి రూ.19,699 కోట్లు పెరిగి రూ.22 లక్షల కోట్లకు చేరుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కరెన్సీ నోట్లలో వృద్ధి వృద్ధి రూ.69,077 కోట్లు దాటింది. ఇది 3.2 శాతం వృద్ధికి సమానం.
ఇంతకు ముందు జూన్ 7తో ముగిసిన వారంలో కరెన్సీ వినియోగం రూ.22,272కోట్లు పెరిగింది. మే 17, జూన్ 14 తో ముగిసిన వారాల్లో చలామణిలో ఉన్న కరెన్సీకన్నా తక్కువ గానే ఉంది. ఇంతకు ముందు జూన్ లో చలామణిలో ఉన్న కరెన్సీ విలువ రూ . 22,19,853 కోట్లుగా ఉంది. పెద్ద నోట్లు రద్దయిన మూడేళ్ళ తర్వాత నగదు మళ్ళీ ఈ స్థాయికి మొదటి సారి చేరుకుంది.

దీపావళి వస్తున్నవేళ
సాధారణంగా దీపావళికి ముందు వారాల్లో కరెన్సీ వినియోగం పెరుగుతుంది. ఈ పండగ సందర్భంగా వినియోగం పుంజుకుంటుంది. వినియోగదారులు అనేక రకాల ఉత్పత్తులు కొనుగోలు చేస్తుంటారు. ఈ సందర్భంగా అనేక మంది నగదు రూపంలోనే చెల్లింపులు చేస్తుంటారు. ఈసారి దీపావళి కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికల సందర్భంగా వస్తోంది. కాబట్టి కొనుగోళ్లు, నగదు వినియోగం మరింత ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు.

పీఎంసీ బ్యాంక్ ప్రభావం
పంజాబ్, మహారాష్త్ర కో ఆపరేటివ్ బ్యాంకు (పీఎంసీ ) సంక్షోభం నేపథ్యంలో బ్యాంకు ఖాతాదారుల్లో ఆందోళనలు పెరిగిపోయాయి. విశ్వాసం సన్నగిల్లింది. పీఎంసీ ఖాతాదారులు తమ ఖాతాల నుంచి తీసుకునే నగదుపై ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలో ఇతర బ్యాంకుల ఖాతాదారులు కాస్త అప్రమత్తమై తమ నగదును బ్యాంకుల నుంచి తీసుకోవడం మొదలు పెట్టారు. దీంతో నగదు చెలామణి పెరిగే అవకాశం ఏర్పడిందని పరిశీలకులు అంటున్నారు.

అయినా తక్కువేనట...
రూ.500, రూ.1,000 రద్దుకన్నా పూర్వం దేశ జీడీపీలో చలామణిలో ఉన్న కరెన్సీ 11.6 శాతం ఉండేది. ఇప్పుడు కరెన్సీ చలామణి పెరిగిపోయినప్పటికీ పెద్ద నోట్ల రద్దుకన్నా ముందు ఉన్న స్థాయికన్నా తక్కువ స్థాయిలోనే ఉన్నట్టు భారత రిజర్వ్ బ్యాంకు అధికారవర్గాలు చెబుతున్నాయి.

వచ్చే ఏడాది తగ్గుతుంది...
ప్రస్తుతం కరెన్సీ వినియోగం ఎక్కువ ఉన్నప్పటికీ వచ్చే ఏడాదిలో తగ్గడానికి అవకాశం ఉందని బ్యాంకర్లు భావిస్తున్నారు. ప్రస్తుతం జాతీయ రహదారులపై టోల్ వసూళ్లు నగదు రూపంలో జరుగుతున్నాయి. అయితే ఈ వసూళ్లను క్రమంగా ఎలక్ట్రానిక్ చెల్లింపులలోకి మార్చుతున్నారు. దీని వల్ల నగదు వినియోగం మరింతగా తగ్గుతుందని బ్యాంకర్లు అంటున్నారు.
More From GoodReturns

విశ్వ విజేతగా భారత్.. కళ్లు చెదిరే నజరానా.. ICC Men's T20 World Cup 2026 ప్రైజ్ మనీ పూర్తి వివరాలు ఇవే..

రికార్డు స్థాయిలో కుప్పకూలిన రూపాయి విలువ..పశ్చిమాసియా దేశాల వార్ దెబ్బకు డాలర్ విలువ పైపైకి..

నేస్తం నేనున్నా.. భారత్కు అండగా నిలిచిన రష్యా.. చమురు సంక్షోభంపై కీలక ప్రకటన..

ఎర్ర సముద్రంలో కల్లోలం..భారత ఎగుమతులపై భారీ ఎఫెక్ట్..తడిసిమోపెడవుతున్న ఛార్జీలు..

యురేనియం నుంచి వాణిజ్యం వరకు.. మోదీ–కార్నీ భేటీలో జరిగిన ఒప్పందాలు ఇవే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!



Click it and Unblock the Notifications