తమ కస్టమర్లకు జియో షాక్ ఇచ్చిన తర్వాత వొడాఫోన్ ఐడియా మాత్రం తమ కస్టమర్లకు గుడ్న్యూస్ తెలిపింది. ఇతర టెలికం ఆపరేటర్స్కు కాల్ చేస్తే జియో తమ కస్టమర్ల నుంచి నిమిషానికి 6 పైసల్ ఛార్జ్ చేస్తోంది. దీని కోసం కొత్త IUC ప్లాన్ను తీసుకు వచ్చింది. ఈ టాపప్ కార్డ్స్ వేసుకుంటే ఉచిత డేటా ఇస్తున్నట్లు ప్రకటించింది. దీంతో జియోపై కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వొడాఫోన్ ఐడియా మాత్రం శుభవార్త చెప్పింది.
ఇతర నెట్వర్క్స్కు వాయిస్ కాల్ చేస్తే తాము ఎలాంటి IUC ఛార్జీలు వసూలు చేయమని స్పష్టం చేసింది. IUC ఛార్జీలు అనేవి మొబైల్ కంపెనీలు తమలో తాము తేల్చుకోవాల్సిన అంశమని, వినియోగదారులకు ఎలాంటి సంబంధం లేదని వోడాఫోన్ ఐడియా పేర్కొంది. అంతేకాదు, IUC ఛార్జీలు వసూలు చేస్తామని ప్రకటించడం తొందరపాటు చర్య అని పేర్కొంది. ఇంటర్ కనెక్ట మధ్య ఇది పరిష్కారం తీసుకురాలేదన్నారు.

ట్రాయ్ నిర్దేశించిన రెగ్యులేటరీ డెఫినేషన్ ప్రకారం IUC ఛార్జీలు మొబైల్ ఆపరేటర్లు తేల్చుకోవాల్సిన విషయాలని, వినియోగదారులకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. కస్టమర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించింది. తమ కస్టమర్లు చేసే ప్రతి కాల్కు ఛార్జీలు పడతాయా లేక ఉచిత కాల్స్ చేస్తున్నామా అని అయోమయానికి గురికావాల్సిన అవసరం లేకుండా చేయడమే తమ ఉద్దేశమని తెలిపింది.
ప్రీపెయిడ్ లేదా పోస్ట్ పెయిడ్ కస్టమర్స్ చేసే కాల్స్ ఏ నెట్ వర్క్కు వెళ్లినా ఉచితమేనని తెలిపింది. దేశంలోని మారుమూల ప్రాంతాలకు సేవలను అందించడం తమకు లాభదాయకం కాకపోయినా సేవలను కొనసాగిస్తున్నామని చెప్పింది.
More From GoodReturns

కుప్పకూలిన ఆసియా స్టాక్ మార్కెట్.. దెబ్బకు దక్షిణ కొరియా మార్కెట్లో నిలిచినపోయిన ట్రేడింగ్..

Sensex today: సెన్సెక్స్ సంచలనం: 20 నిమిషాల్లో 900 పాయింట్లు జంప్.. కారణం ఇదే!

మూడో రోజూ కుప్పకూలిన స్టాక్ మార్కెట్..రికార్డు కనిష్టానికి రూపాయి.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన..

భారత స్టాక్ మార్కెట్లు పతనం.. చమురు ధరలు పెరగడంతో కుప్పకూలిన మార్కెట్

ఇరాన్ యుద్ధంతో స్టాక్ మార్కెట్లో భయాందోళన..728 పాయింట్లు పడిపోయిన గిఫ్ట్ నిఫ్టీ.. భారీగా పెరిగిన ఇండియా VIX..

భారీ నష్టాలతో ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్..రూ. 9 లక్షల కోట్ల నష్టం.. సెన్సెక్స్, నిఫ్టీ పతనం..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!



Click it and Unblock the Notifications