ముంబై: ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా వంటి ఇతర ఆపరేటర్లకు ఫోన్ కాల్ చేస్తే నిమిషానికి 6 పైసలు వసూలు చేస్తామని రిలయన్స్ జియో ప్రకటించిన నేపథ్యంలో మార్కెట్ తారుమారైంది! ఇటీవలి వరకు జియో జోరు కనిపించింది. అదే సమయంలో ఇతర ఆపరేటర్ల కస్టమర్ల సంఖ్య తగ్గుతూ వచ్చింది. మార్కెట్ పరిస్థితి కూడా దాదాపు అలాగే ఉంది. కానీ కాల్స్పై ఆరు పైసలు వసూలు చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో వొడాఫోన్, ఐడియా షేర్లు గురువారం దూసుకెళ్లాయి.

ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా షేర్లు జూమ్
వొడాఫోన్ ఏడియా షేర్లు నిన్న (అక్టోబర్ 10) 18 శాతానికి పైగా లాభపడ్డాయి. ఎయిర్ టెల్ 4.8 శాతం దూసుకెళ్లింది. ఇప్పటి వరకు ఇతర నెట్ వర్క్స్కు ఉచిత కాల్స్ సదుపాయం అందించిన జియో ఇప్పుడు నిమిషానికి కొంత మొత్తం వసూలు చేస్తోంది. దానికి బదులు డేటా ఇస్తోంది. ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా షేర్లు షేర్లు ఈ రోజు (శుక్రవారం, అక్టోబర్ 11) కూడా ఎగిశాయి.

అక్టోబర్ 10వ తేదీ నుంచి రీచార్జ్ చేసుకునే వారికి మాత్రమే...
తక్కువ మొత్తానికే డేటా, వాయిస్ కాల్స్ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పటి వరకు జియో యూజర్లు భారీగా పెరిగారు. జియో త్వరగా ఎదగడానికి డేటాతో పాటు ఏ నెట్వర్క్కైనా ఎంత సమయమైనా ఉచితంగా మాట్లాడుకునే వెసులుబాటు కల్పించడం. దీంతో జియో దెబ్బకు ఇతర టెలికం సంస్థలు దెబ్బతిన్నాయి.
ఇప్పుడు ఇంటర్కనెక్ట్ యూసేజ్ చార్జ్ (IUC) చార్జీలు వసూలు చేయనున్నట్లు ప్రకటించడంతో జియోపై ప్రభావం పడింది. ఇతర నెట్ వర్క్స్కు కాల్ చేస్తే నిమిషానికి 6 పైసలు వసూలు చేస్తామని తెలిపింది. అక్టోబర్ 10వ తేదీ కంటే ముందు రీచార్జ్ చేసుకున్న వారికి IUC ఛార్జీలు అవసరం లేదు. 10వతేదీ నుంచి రీచార్జ్ చేసుకుంటే చెల్లించాల్సి ఉంటుంది.

ఎయిర్ టెల్ ఏం చెప్పిందంటే..
జియో IUC ప్రకటనపై ఎయిర్ టెల్ ఇటీవల స్పందించింది. నిమిషానికి ఆరు పైసలు విధించడం ద్వారా ఐయూసీ ఛార్జీలని ట్రాయ్ తగ్గించాలని జియో ఒత్తిడి చేసినట్లుగా కనిపిస్తోందని పేర్కొంది. అయితే జియో పేరును మాత్రం ప్రరస్తావించలేదు. ఐయూసీ ఛార్జీలను పూర్తిగా ట్రాయ్ రద్దు చేసేందుకు తమ ప్రత్యర్థి నెట్ వర్క్ నిమిషానికి ఆరు పైసలు అంశాన్ని తెరపైకి తెచ్చిందని పేర్కొంది. 2017లో IUC ఛార్జీలను 14 పైసల నుంచి 6 పైసలకు తగ్గించడంపై ఎయిర్ టెల్ ఆందోళన కూడా వ్యక్తం చేసింది.
More From GoodReturns

Sensex today: సెన్సెక్స్ సంచలనం: 20 నిమిషాల్లో 900 పాయింట్లు జంప్.. కారణం ఇదే!

మూడో రోజూ కుప్పకూలిన స్టాక్ మార్కెట్..రికార్డు కనిష్టానికి రూపాయి.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన..

ఇరాన్ యుద్ధంతో స్టాక్ మార్కెట్లో భయాందోళన..728 పాయింట్లు పడిపోయిన గిఫ్ట్ నిఫ్టీ.. భారీగా పెరిగిన ఇండియా VIX..

భారత స్టాక్ మార్కెట్లు పతనం.. చమురు ధరలు పెరగడంతో కుప్పకూలిన మార్కెట్

భారీ నష్టాలతో ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్..రూ. 9 లక్షల కోట్ల నష్టం.. సెన్సెక్స్, నిఫ్టీ పతనం..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?



Click it and Unblock the Notifications