భారత్ లో తయారీ పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక రకాల చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా కంపెనీలకు ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. పన్ను ప్రయోజనాలు ఇస్తోంది. అయినప్పటికీ భారత్ లో తయారీ ఊపందుకోవడం లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరిన్ని చర్యలకు సిద్ధం అవుతోంది. ఇందులో భాగంగా మరిన్ని ఉత్పత్తుల దిగుమతులపై సుంకాలను విధించాలని భావిస్తోంది. వీటిలో ఎలక్ట్రానిక్స్, బొమ్మలు, బ్లాంకెట్లు, రోజువారీగా వినియోగించే ఉత్పత్తులు ఉన్నాయి. వీటిపై సుంకాలను విధించడం ద్వారా వాటి దిగుమతులు తగ్గే విధంగా చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఇప్పటికే కొన్ని రకాల ఉత్పత్తులపై సుంకాలు పెంచింది ప్రభుత్వం.

జాబితా సిద్ధం
* ఏయే ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు విధించాలన్న జాబితాను వాణిజ్యశాఖ విభాగం సిద్ధం చేసింది. అయితే ఈ జాబితాలోని ఉత్పత్తులపై తుది నిర్ణయం తీసుకునే ముందు ప్రభుత్వ ఏజెన్సీలతో సంప్రదించాలని వేచిచూస్తున్నారు.
* ఈ ఏజెన్సీలు ఓకే చెబితే ఆయా ఉత్పత్తులపై సుంకాలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది.
* దాదాపు 100-150 కంపెనీలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది.

దేశీ కంపెనీలకు ప్రయోజనం
* ప్రభుత్వం వివిధ ఉత్పత్తులపై సుంకాలను విధించడం వల్ల ఆయా ఉత్పత్తుల దిగుమతులు తగ్గుతాయి. ఫలితంగా దేశీయంగా ఉత్పత్తి పెరగడానికి దోహద పడుతుంది. దీనివల్ల దేశీయ కంపెనీల ప్రయోజనాలు కాపాడినట్టవుతుంది.
* మరో విషయం ఏమిటంటే మనదేశానికి ఉత్పత్తులు పంపుతున్న కంపెనీలు తమ యూనిట్లను భారత్ లో ఏర్పాటు చేసే అవకాశాలు ఉంటాయని ప్రభుత్వం భావిస్తోంది.
* దేశేయ కంపెనీలు ఉత్పత్తిని పెంచి, విదేశీ కంపెనీలు కూడా దేశంలో యూనిట్లను ఏర్పాటు చేస్తే పెద్ద ఎత్తున ఉత్పత్తి పెరగడమే కాకుండా లక్షలాదిగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రభుత్వం యోచిస్తోంది.
* అంతే కాకుండా దేశం నుంచి ఎగుమతులను పెంచడానికి అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

రిస్కులు ఉన్నాయి...
* విదేశాల నుంచి కొన్ని ఉత్పత్తులు దిగుమతి చేసుకోవడం వల్ల అవి తక్కువ ధరలకు లభిస్తున్నాయి. ఇప్పుడు అలాంటి ఉత్పత్తులపై సుంకాలు విధించడం వల్ల వాటి ధరలు పెరగడానికి అవకాశం ఉంటుంది.
* అధిక పన్నులకారణంగా ముడిసరుకుల దిగుమతులపై ఆధారపడిన కంపెనీలపై ప్రభావం పడే ఆస్కారం.
* భారత్ తో స్వేచ్చా వాణిజ్య ఒప్పందం కలిగిన దేశాలకు ఎక్కువ ప్రయోజనం కలిగే అవకాశం ఉందని అంటున్నారు.
* ఆసియాన్ దేశాలు, చైనా, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ లతో ప్రతిపాదిత స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం వల్ల 80-90 శాతం ఉత్పత్తులను తక్కువ పన్నుకు లేదా సున్నా పన్నుకు దిగుమతులను అనుమతించాల్సి ఉంటుంది.
More From GoodReturns

భారతదేశంలో లాక్డౌన్.. గూగుల్లో తెగ వెతికేస్తున్న నెటిజన్లు.. వెస్ట్ ఆసియా దేశాల్లో ఎమర్జెన్సీ ప్రకటన..

చమురు సంక్షోభంలో స్నేహితుడికి అండగా రష్యా.. భారత రిఫైనరీ కంపెనీలకు 6 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు సరఫరా

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?



Click it and Unblock the Notifications