అనిల్ అంబానీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రుణ వితరణ వ్యాపారానికి గుడ్ బై చెప్పాలని రిలయన్స్ కేపిటల్ (Rcap) నిర్ణయించింది. సోమవారం జరిగిన కంపెనీ వాటాదారుల వార్షిక సర్వసభ్య సమావేశంలో (AGM) ప్రకటించారు. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న అడాగ్ గ్రూప్కు చెందిన 3 కంపెనీల ఏజీఎంలలో సోమవారం అంబానీ పాల్గొన్నారు. గత ఆరు నెలల్లో చోటు చేసుకున్న ప్రతికూల సంఘటనలను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రెగ్యులేటరీ, ఆర్బిట్రేషన్, కారణంగా తమ కంపెనీకి రావాల్సిన రూ.60 వేల కోట్ల బకాయిలు గత అయిదు నుంచి పదేళ్లుగా పెండింగులో ఉన్నాయన్నారు.
అనుబంధ కంపెనీలు రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ కంపెనీల ద్వారా రిలయన్స్ క్యాపిటల్ MSME, గృహాల కొనుగోలుదారులకు రుణాలు ఇస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రెండు అనుబంధ కంపెనీల్లో ప్రధాన వాటాదారుగా మాత్రం కొనసాగుతామని తెలిపారు. రిలయన్స్ ఇన్ఫ్రాకు మౌలిక సదుపాయాల రంగంలో మంచి వ్యాపార అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం వచ్చే అయిదేళ్లలో మౌలిక సదుపాయాలపై రూ.100 లక్షల కోట్లు ఖర్చు చేయడం ఆర్ఇన్ఫ్రాకు కలిసి వస్తుందన్నారు. రక్షణ రంగంలో మరిన్ని వ్యాపార అవకాశాలు లభిస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. దేశంలో అత్యుత్తమ 5 ప్రైవేటు రక్షణ కంపెనీల్లో ఒకటిగా ఎదగాలని భావిస్తున్నామన్నారు. ఆధునాతన సాంకేతికను అందిపుచ్చుకొని అంతర్జాతీయ సరఫరా సంస్థగా మారుతామన్నారు.

ప్రస్తుతం రూ.6,000 కోట్ల వరకు ఉన్న ఆర్ఇన్ఫ్రా అప్పుల భారాన్ని మరింత తగ్గిస్తామన్నారు. అదే సమయంలో భారీగా ఆస్తులు కూడా ఉన్నాయన్నారు. రిలయన్స్ పవర్ ద్వారా త్వరలో సౌర, పవన విద్యుదుత్పత్తి రంగాల్లోకి ప్రవేశిస్తామన్నారు. ప్రస్తుత థర్మల్ పవర్ ప్లాంట్ల ద్వారా రూ.4,000 కోట్ల ఖర్చుతో ప్లూ గ్యాస్ డిసల్పరైజేషన్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నారు. రహదారులు, మెట్రో, ఇంధనం, విమాాశ్రయాలు సహా ాలుగు వ్యాపార విభాగాలకు పూర్తి నిధుల లభ్యత ఉందన్నారు.
దేశ మౌలిక అవసరాలు చాలా ఎక్కువగా ఉన్నాయని, కంపెనీ రూ.7000 కోట్ల విలువైన వెర్సోవా-బాంద్రా సీలింగ్ ప్రాజెక్టు వంటి భారీ ఆర్డర్లు అందుకుందని చెప్పారు. ఢిల్లీ - ఆగ్రా టోల్ రోడ్ విక్రయం వచ్చే కొన్ని వారాల్లో ముగిసే అవకాశం ఉందని, దీంతో ఆర్ ఇన్ఫ్రాకు రూ.3600 కోట్లు వస్తాయన్నారు.
ఇదిలా ఉండగా, ఆర్.కామ్.దివాలా ప్రకటించిన నేపథ్యంలో కంపెనీ భవిష్యత్తుపై వాటాదార్లు ఆందోళగా ఉన్నారు. సంస్థ దివాలా ప్రక్రియ నడుస్తుండటం వల్ల కార్పోరేట్ పరిష్కార ప్రక్రియ పూర్తి చేసేందుకు ఎన్సీఎల్టీ అదనంగా మూడు నెలల సమయం కేటాయించింది. జనవరి 10వ తేదీలోగా పూర్తి చేయాలని వాటాదార్లకు స్పష్టం చేశారు. అలాగే, నేవీ ముంబైలో కంపెనీకి చెందిన అతిపెద్ద స్థిరాస్థి ధీరుబాయ్ అంబానీ నాలెడ్జ్ సెంటర్ భవిష్యత్తుపై స్పష్టమైన సమాచారం కావాలని వాటాదార్లు కోరుతున్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications