ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) చైర్మన్ ముఖేష్ అంబానీ కుటుంబంలోని నలుగురికి ఇన్కం ట్యాక్స్ డిపార్టుమెంట్ ముంబై యూనిట్ నోటీసులు పంపించిందా? అంటే అవుననే వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ముఖేష్ సతీమణి నీతా అంబానీ, ముగ్గురు పిల్లలకి నోటీసులు పంపించారట. 2015 బ్లాక్ మనీ యాక్ట్ కింద ఈ నోటీసులను ఈ ఏడాది మార్చి 28వ తేదీన జారీ చేశారని అంటున్నారు.

ముఖేష్ కుటుంబంలోని నలుగురికి నోటీసులు
మీడియాలో వస్తున్న వార్తల మేరకు ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీతో పాటు వారి సంతానం అనంత్ అంబానీ, ఆకాష్ అంబానీ, ఇషా అంబానీలకు ఐటి డిపార్టుమెంట్ నోటీసులు ఇచ్చిందట. వివిధ దేశాల నుంచి వచ్చిన సమాచారంపై దర్యాఫ్తు జరిపిన తర్వాత ఆదాయ పన్ను శాఖ వీరికి నోటీసులు పంపించిందట. అనంత్, ఆకాష్, ఇషా, నీతా అంబానీలు వివిధ దేశాల్లోని విదేశీ ఆదాయాన్ని, ఆస్తులను వెల్లడించలేదట.

స్విస్ లీక్స్...
హెచ్ఎస్బీసీ జెనీవాలో 700 మందికి పైగా భారతీయులు లేదా భారతీయ కంపెనీలకు ఖాతాలు ఉన్న వారి వివరాలు భారత ప్రభుత్వానికి లభించాయి. వీటి ఆధారంగా ఐటీ అధికారులు దర్యాఫ్తు చేస్తున్నారు. స్విస్ లీక్స్గా వ్యవహరించే ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్స్ (ఫిబ్రవరి 2015) హెచ్ఎస్బీసీ జెనీవా బ్యాంకు అకౌంట్ హోల్డర్ల సంఖ్య 1195గా పేర్కొంది.

సంబంధాలు...
601 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.4200 కోట్లు) బ్యాలెన్సుతో 14 హెచ్ఎస్బీసీ జెనీవా బ్యాంకు అకౌంట్స్ క్లస్టర్ను ఇండియన్ ఎక్స్ప్రెస్ నివేదించింది. ఇవన్నీ మధ్యవర్తుల ద్వారా రిలయన్స్ ఆర్ఐఎల్ గ్రూప్తో అనుసంధానించబడ్డాయని తెలిపింది. ఈ పద్నాలుగు కంపెనీల్లో ఒక దానిలో అంతిమ లబ్ధిదారులుగా వారి కుటుంబం పేర్లు ఉన్నాయని, వివిధ దేశీయ, విదేశీ సంస్థల ద్వారా ఈ సంస్థల్లో భారీ మొత్తాన్ని ఎలా అనుసంధానించబడి, ఎలా పెట్టుబడి పెట్టారో ఐటీ డిపార్టుమెంట్ నివేదిక వెల్లడించిందట.

రిలయన్స్ ఖండన
ఈ మేరకు 4, ఫిబ్రవరి 2019 తేదీతో ఐటీ డిపార్టుమెంట్ మార్చి 28, 2019న నోటీసులు పంపించిందట. అయితే నోటీసుల ఆరోపణలను రిలయన్స్ ప్రతినిధులు ఖండించారు. ఐటీ శాఖ తమకు ఎలాంటి నోటీసులు జారీ చేయలేదని పేర్కొంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications