త్వరలో ప్రావిడెంట్ ఫండ్ పైన 8.65 శాతం వడ్డీ
2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను ఎంప్లాయ్ ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్స్ పైన 8.65 శాతంగా నిర్ణయిస్తూ క్వపవో కార్మిక మంత్రిత్వ శాఖ ప్రకటన వెలువరిస్తుందని ఆ శాఖ మంత్రి సంతోష్ గాంగ్వార్ శుక్రవారం చెప్పారు. శుక్రవారం నాడు ఢిల్లీలో జరిగిన ప్రైవేటు సెక్యూరిటీ గార్డ్స్ సమావేశంలో పాల్గొని, ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం త్వరలో దీనిపై నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుందన్నారు.
విమాన టిక్కెట్ల ధరలో 50 శాతమే, వీఐపీలకు నో ఆఫర్స్, సౌకర్యాలు అదుర్స్
కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో 6కోట్ల మంది పీఎఫ్ అకౌంట్ హోల్డర్లకు లబ్ది చేకూరనుందన్నారు. పీఎఫ్ పైన 8.65 శాతం వడ్డీ ఇచ్చేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ విభేదించడం లేదని స్పష్టం చేశారు. గత ఫిబ్రవరి నెలలో గాంగ్వార్ నేతృత్వంలోని ఈపీఎఫ్వో కేంద్ర ధర్మకర్తల మండలి వడ్డీని పెంచాలని నిర్ణయించింది.
ఈ ప్రతిపాదనను ఆర్థిక మంత్రిత్వ శాఖకు సిఫార్సు చేయగా, ఆర్ధిక సేవల విభాగం(డీఎఫ్ఎస్) ఏప్రిల్ నెలలో (2018-19)సంవత్సరానికి పీఎఫ్పై 8.65 శాతం వడ్డీ ఇచ్చేందుకు ఓకే చెప్పింది. కార్మిక శాఖ, ఆదాయ పన్ను శాఖనోటిఫై చేయాల్సి ఉంది. అనంతరం పీఎఫ్ అకౌంట్లలో వడ్డీని జమ చేస్తారు. ఖాతా దారులకు ఇప్పుడు 8.55శాతం వడ్డీ లభిస్తోంది.
ఈపీఎఫ్ లెక్క ప్రకారం 8.65 శాతం వడ్డీని చెల్లిస్తే రూ.151.67 కోట్ల మిగులు ధనం ఉంటుంది. 8.70 శాతం ఇస్తే 158 కోట్ల ద్రవ్యలోటును సంస్థ భరించవలసి ఉంటుంది. అందుకే 2018-19కి గాను 8.65 శాతం వడ్డీని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.