మూడేళ్ల క్రితం ప్రారంభమైన రిలయన్స్ జియో దూసుకెళ్తోంది. ఐడియా వొడాఫోన్, ఎయిర్టెల్ను దాటి, ఆ కంపెనీలకు చుక్కలు చూపిస్తోంది. అత్యంత తక్కువ ధరకు డేటా, వాయిస్ కాల్స్ అందిస్తోంది. జియో కారణంగా ప్రత్యర్థి కంపెనీలు తమ వ్యూహాలు మార్చుకుంటున్నాయి. అయినప్పటికీ జియోకు గట్టి పోటీ ఇవ్వలేకపోతున్నాయి. టారిఫ్ గేమ్లో తన గేర్లు మార్చేందుకు ఎయిర్టెల్ సిద్ధపడుతోంది.

ఆర్పూపై ఎయిర్టెల్ దృష్టి
తమకు ఉన్న కస్టమర్లలో అత్యధికంగా స్పెండ్ చేసేవారికి, పోస్ట్పేయిడ్ కస్టమర్లకు ప్రోత్సాహకాలు, ఇతర సేవలు అందించడం ద్వారా జియోను ధీటుగా ఎదుర్కోవాలని భావిస్తోంది. జియో, వొడాఫోన్ ఐడియా వలె కాకుండా ఎయిర్టెల్ ARPUపై దృష్టి సారించింది. అలాగే, ఎయిర్టెల్ థ్యాంక్స్ పేరుతో కస్టమర్లకు ఆకట్టుకుంది. ఆర్పుపై దృష్టి పెట్టిన నేపథ్యంలో ఇది చార్ట్లో 129వ స్థానంలో ఉంది.

సరికొత్త ఎయిర్ టెల్ బ్లాక్
ఇప్పుడు మరో ప్లాన్తో ఎయిర్టెల్ ముందుకు వస్తోంది. హై-పేయింగ్ కస్టమర్లకు మరో ప్రీమియం సబ్స్క్రిప్షన్తో ముందుకు వస్తోంది. ఈ మేరకు ఎకనమిక్ టైమ్స్లో వార్త వచ్చింది. Airtel Black పేరుతో దీనిని తీసుకు వస్తోంది. ఈ ప్లాన్ ద్వారా అధికంగా చెల్లించే కస్టమర్లకు ప్రత్యేకమైన ప్రయోజనాలు అందించడంపై ఎయిర్టెల్ దృష్టి సారించింది. అదే సమయంలో, ఈ బెనిఫిట్స్ చూపించి ఇప్పటికే తక్కువ ఖర్చు చేస్తున్న కస్టమర్ల ద్వారా ఆర్పును పెంచుకునే ప్రయత్నాలు చేస్తోంది.

ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి?
ఎయిర్ టెల్ బ్లాక్ ద్వారా వివిధ రకాల ప్రయోజనాలను కల్పిస్తోంది. బెట్టర్ కంటెంట్ ఆఫరింగ్స్, కన్స్యూమర్ బ్రాండ్స్ పైన డిస్కౌంట్లు, ఇంటర్నేషనల్ రోమింగ్స్, హెల్త్ ఇన్సూరెన్స్, వివిధ రకాల యాప్స్, స్ట్రీమింగ్ సేవలు వంటి బెనిఫిట్స్ అందిస్తారు. ఎయిర్ టెల్ బ్లాక్ ప్లాన్ను ఎయిర్టెల్ థ్యాంక్స్ ప్రోగ్రాంలోనే భాగం చేస్తున్నారు. రూ.999 అంతకంటే ఎక్కువ ఖర్చు చేసేందుకు సిద్ధంగా కస్టమర్లకు ఈ ప్రయోజనాలు ఉంటాయి.

రెవెన్యూ..
ఖర్చు చేయని కస్టమర్లను దూరం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా కనిపిస్తోంది. అదే సమయంలో ఇలాంటి ఆఫర్ల ద్వారా ఎక్కువ రెవెన్యూ రాబట్టడానికి సిద్ధపడినట్లుగా కనిపిస్తోంది. రిలయన్స్ జియో లో-వ్యాల్యూ ప్లాన్స్ ఎలాగూ తక్కువ ఖర్చు చేసే కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఎయిర్ టెల్ వినూత్న ఎయిర్ టెల్ బ్లాక్ తీసుకు రానుంది. ఎయిర్ టెల్ బ్లాక్ ద్వారా.. పోస్ట్ పెయిడ్ వ్యాపారం పెంచుకోవడం, ఎయిర్ టెల్ థ్యాంక్స్ ప్రోగ్రాంలోని తక్కువ వ్యాల్యూ కలిగిన కస్టమర్లను బ్లాక్లోకి అప్ గ్రేడ్ చేయడం, విలువైన కస్టమర్లను ఎయిర్టెల్ కస్టమర్లుగా ఉంచడమే లక్ష్యం.

జియో వైపు వెళ్లకుండా..
ఎయిర్ టెల్ రెండు కేటగిరీల్లో కస్టమర్లను కలిగి ఉంది. ఎయిర్ టెల్ గోల్డ్ కింద రూ.499 లోపు కస్టమర్లు, ప్లాటినం కింద రూ.499 కంటే ఎక్కువ చెల్లించేవారు ఉన్నారు. ఇప్పుడు ఎయిర్ టెల్ బ్లాక్ ద్వారా అధిక ప్రయోజనాలతో ఎక్కువ మందిని ఆకర్షించాలని చూస్తోంది. ఇది కస్టమర్లకు ప్రయోజనంతో పాటు కంపెనీకి కూడా ఎక్కువ రెవెన్యూ తెచ్చి పెడుతుంది. ఎక్కువ చెల్లించే కస్టమర్లను నిలుపుకునే ఉద్దేశ్యంలో ఎయిర్ టెల్ ఉంది. వీరిని జియో వంటి ప్రత్యర్థి ఆపరేటర్లకు వెళ్లకుండా ప్రయత్నాలు చేస్తోంది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications