న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చే అయిదేళ్లలో 5 ట్రిలియన్ డాలర్ల టార్గెట్ పెట్టుకుంది. దీనిని చేరుకోవాలంటే ప్రతి సంవత్సరం వృద్ధి రేటు 9 శాతంగా ఉండాలని అంచనా. అలాగే, స్థూల జాతీయోత్పత్తిలో పెట్టుబడి రేటును 38 శాతానికి పెంచవలసి ఉంటుంది. వచ్చే అయిదేళ్లలో తొమ్మిది శాతం వృద్ధిరేటు సాధిస్తేనే దేశ ఆర్థిక వ్యవస్థ 5 లక్షల కోట్ల డాలర్లకు చేరుకునే అవకాశం ఉందని యర్నెస్ట్ అండ్ యంగ్(ఈవై) వెల్లడించింది.

ఈ వృద్ధితో మోడీ టార్గెట్ చేరుకోవడం కష్టమే
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్దేశించుకున్న ఐదు లక్షల కోట్ల డాలర్లకు చేరుకోవడం ప్రస్తుత వృద్ధితో అసాధ్యమని అభిప్రాయపడింది. తాజాగా విడుదల చేసిన నివేదికలో వచ్చే మార్చి నాటికి 7 శాతం వృద్ధితో భారత ఆర్థిక వ్యవస్థ మూడు లక్షల కోట్ల డాలర్లకు చేరుకునే అవకాశముందని పేర్కొంది.

9 శాతం వృద్ధి సాధిస్తే ఇలా పెరుగుదల..
గత ఏడాది ఇది 2.7 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. వరుసగా వచ్చే అయిదేళ్ల పాటు తొమ్మిది శాతం వృద్ధిరేటును సాధిస్తే భారత ఆర్థిక వ్యవస్థ 2020-21లో 3.3 ట్రిలియన్ డాలర్లకు, ఆ తర్వాత సంవత్సరం 3.6 ట్రిలియన్ డాలర్లకు, 2022-23 నాటికి 4.1 ట్రిలియన్ డాలర్లకు, 2023-24లో 4.5 ట్రిలియన్ డాలర్లకు, 2024-25 ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి 5 ట్రిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశముందని పేర్కొంది.

వృద్ధి శాతంతో పాటు ఇవి కూడా..
ద్రవ్యోల్బణం 4% కంటే తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు, అలాగే డాలర్తో పోలిస్తే రూపాయి విలువ మరో రెండు శాతం బలపడినప్పుడే ఈ లక్ష్యానికి చేరుకుంటామని తెలిపింది. వృద్ధికి ఊతమిచ్చే చర్యలను కేంద్ర ప్రభుత్వం మరింత ప్రోత్సహించాలని తెలిపింది. ముఖ్యంగా ప్రయివేటు పెట్టుబడులను మరింత ప్రోత్సహిస్తేనే ఇది సాధ్యమవుతుందని తెలిపింది.
More From GoodReturns

విశ్వ విజేతగా భారత్.. కళ్లు చెదిరే నజరానా.. ICC Men's T20 World Cup 2026 ప్రైజ్ మనీ పూర్తి వివరాలు ఇవే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..



Click it and Unblock the Notifications