అమరావతి: ఆంధ్రప్రదేశ్లో పంట బీమా పథకాన్ని ఖరీఫ్ నుంచి అమలు చేయాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. ఈ పథకం కింద అతివృష్టి, అనావృష్టి, ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు, కౌలు రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం వారి తరఫున బీమా కంపెనీలకు ప్రీమియం మొత్తాన్ని చెల్లిస్తోంది. ప్రధానమంత్రి పంటల బీమా (PMFBY), ఆధునీకరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా స్కీం (RWBCIS) అమలులో ఉన్నాయి. PMFBY అన్ని జిల్లాల్లో అమలు చేస్తున్నారు.

రూపాయి చెల్లిస్తే చాలు...
ఆంధ్రప్రదేశ్లో రైతులు ఒక్క రూపాయి చెల్లించి పంట బీమా పథకంలో చేరాలి. రుణాలు పొందే రైతుల నుంచి బ్యాంకులే స్వయంగా ఒక్క రూపాయి మినహాయించుకొని బీమా కంపెనీలకు చెల్లిస్తాయి. రుణాలు తీసుకోని రైతులు మాత్రం మీ సేవా కేంద్రంలో రూపాయి చెల్లించి రైతు పేరు, సాగు చేస్తున్న పంట, సాగు విస్తీర్ణం, భూమి వివరాలు నమోదు చేయించుకోవాలి. రైతులు రూపాయి ఇచ్చి స్కీంలో చేరితే, ప్రీమియంను ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఇందుకోసం బడ్జెట్లో రూ.1,163 కోట్లు కేటాయించారు.

ఇది వరకు ఇలా.. ఇప్పుడు ప్రభుత్వమే చెల్లిస్తుంది
ఇదివరకు, బీమా సంస్థలు నిర్ణయించిన ప్రకారం రైతులు ప్రీమియం విలువలో 2 శాతం నుంచి 5 శాతం చెల్లిస్తే మిగతా మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50 శాతం చొప్పున చెల్లించేవి. ఇప్పుడు ప్రీమియం మొత్తం ప్రభుత్వమే భరించనుంది. దీంతో రైతులు అందరూ లబ్ధి పొందే అవకాశముంది. కేవలం రూపాయితో స్కీంలో చేరితే చాలు. కౌలు రైతుల తరఫున కూడా ప్రభుత్వమే పంట బీమా చెల్లిస్తుంది.

గుడ్న్యూస్... ఆగస్ట్ చివరి వరకు పొడిగింపు
పంట బీమా ప్రీమియం చెల్లింపుకు తొలుత జూలై 31వ తేదీ వరకు గడువు విధించారు. ఇప్పుడు ఆగస్ట్ చివరి వరకు పొడిగించారు. కేవలం ఒక్క రూపాయితోనే పంట బీమా సౌకర్యం అందరు రైతులు ఉపయోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పంటలు నమోదు చేసేందుకు ఉత్తర్వులు జారీ చేసిందని, కానీ వ్యవసాయ శాఖ విస్తృతంగా ప్రచారం చేయలేదని, అలాగే వర్షాలు ఆలస్యంగా రావడంతో ఇప్పటి వరకు ప్రాజెక్టుల్లో నీరు చేరలేదని, ఈ నేపథ్యంలో పంట బీమా నమోదు గడువు పెంచాలని ఇటీవల డిమాండ్లు కూడా వచ్చాయి. ప్రభుత్వం కూడా దీనిని పొడిగించింది.

గురువారం వరకు బీమా పొందిన రైతులు
ఆగస్ట్ 1వ తేదీ వరకు పలువురు రైతులు పంట బీమా పొందారు. PMFBY, RWBCIS కింద రుణం పొందిన, రుణం తీసుకొని రైతులు ఈ బీమా సౌకర్యం పొందారు. అనంతపురం, ప్రకాశం, కర్నూలు, కడప జిల్లాలు టాప్లో నిలిచారు. మొత్తంగా ఐదున్నర లక్షల మంది రుణం పొందిన రైతులు, దాదాపు 2 లక్షల 70వేల మంది రుణం పొందని రైతులు ఉన్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications