కొలంబో: శ్రీలంక మరింతమంది పర్యాటకులను ఆకర్షించేందుకు కీలక నిర్ణయం తీసుకోనుంది. భారత్, చైనా సహా మొత్తం 48 దేశాల ప్రయాణీకుల కోసం ఇప్పటికే ఉన్న ఎంట్రీ వీసా ఫీజును ఆగస్ట్ 1వ తేదీ నుంచి మాఫీ చేయనుందని బుధవారం ఓ అధికారి వెల్లడించారు.
భారత్, చైనా, అమెరికా, జర్మనీ, కెనడా, మలేషియా, ఇండోనేషియా తదితర దేశాల నుంచి వచ్చే ప్రయాణీకులకు ప్రస్తుతం వీసా ఫీజు 25 డాలర్లుగా ఉందని, దీనిని మాఫీ చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని టూరిజం డెవలప్మెంట్, వైల్డ్ లైఫ్ అండ్ క్రిస్టియన్ రిలీజియస్ అఫైర్ మినిస్టర్ జాహన్ అమరతుంగ వెల్లడించారు.
ప్రస్తుతానికి ఈ విధానం ఆరు నెలల పాటు అమలులో ఉంటుందని చెప్పారు. ఆ తర్వాత దీని పొడిగింపుపై నిర్ణయం తీసుకోనున్నారు.

శ్రీలంకను సందర్శించాలనుకునే ప్రయాణీకులు ఆయా దేశాల్లోని శ్రీలంక రాయబార కార్యాలయ వెబ్సైట్లను యాక్సెస్ చేసి లేదా ఇమ్మిగ్రేషన్ వెబ్ సైట్ను సందర్శించి అవసరమైన సమాచారాన్ని ఎలక్ట్రానిక్ పద్ధతిలో సమర్పించి వీసా అనుమతిని పొందవచ్చునని ఇమ్మిగ్రేషన్ అండ్ ఎమిగ్రేషన్ కంట్రోలర్ జనరల్ పవన్ రత్నాయకే తెలిపారు. శ్రీలంకకు ప్రయాణించేవారు వీసా అనుమతి పొందని పక్షంలో బండారనాయకే ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులోని వీసా కౌంటర్లో అవసరమైన డాక్యుమెంట్లు ఇవ్వాలన్నారు.
తమ జాబితాలోని దేశాల వారికి ఉచిత 30 రోజుల వీసా ఇస్తామని, మరింతకాలం పొడిగింపు కావాలంటే అవసరమైన చెల్లింపులు జరపాలని రత్నాయకే చెప్పారు.
కాగా, ఏప్రిల్ 21వ తేదీన ఆదివారం రోజు ఉగ్రవాద దాడి కారణంగా 250 మంది చనిపోయారు. వందలాది మంది గాయపడ్డారు. దీంతో శ్రీలంక టూరిజంపై ప్రభావం పడింది. ఇలాంటి పరిస్థితుల్లో, టూరిస్టులను ఆకర్షించే ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ ఏడాది చివరి నాటికి 1.9 మిలియన్ల నుంచి 2 మిలియన్ల టూరిస్టులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఉగ్రదాడికి సంబంధించిన అందరినీ అరెస్టు చేశామని, శ్రీలంక ఇప్పుడు సేఫ్ అని, ట్రావెలర్స్కు ఎలాంటి భయం లేదని ప్రధాని రణీల్ విక్రమ సింఘే చెప్పారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!



Click it and Unblock the Notifications